ప్ర‌ముఖ తెలుగు నిర్మాత క‌న్నుమూత‌, హీరో నాని సంతాపం

ప్ర‌ముఖ నిర్మాత కోనేరు అనిల్ కుమార్ క‌న్నుమూశారు. ఆయ‌న బాపు ద‌ర్శ‌క‌త్వంలో “రాధాగోపాలం” చిత్రాన్ని నిర్మించారు. అలాగే “అల్లరి బుల్లోడు” చిత్రాన్ని కూడా తీశారు. కొంత కాలం గా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. శుక్ర‌వారం హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్ లో చికిత్స‌పొందుతూ క‌న్నుమూశారు.

ఈ విషయమై నాని ఆవేదన చెందుతూ ట్వీట్ చేసారు. అసెస్టెంట్ డైరక్టర్ గా నా మొదట శాలరీ ఆయన సంతకంతోనే అందుకున్నాను. నా మెంటర్, ప్యామిలీ, చాలా మిస్సైయ్యాను అన్నారు.

రాజేంద్ర ప్రసాద్, శివాజీ హీరోలుగా ‘శ్రీరామచంద్రులు’, శ్రీకాంత్‌తో ‘ఒట్టేసి చెబుతున్నా’, ‘రాధాగోపాలం’, నితిన్‌తో ‘అల్లరి బుల్లోడు’ వంటి చిత్రాలకు అనిల్ నిర్మాతగా వ్యవహరించారు. అనిల్ కుమార్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు.