బ్రేకింగ్ న్యూస్.. మృతి చెందిన ఎన్టీఆర్ అభిమాని జనార్ధన్?

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన జనార్ధన్ అనే ఎన్టీఆర్ అభిమాని రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. రోడ్డు ప్రమాదానికి గురైన జనార్ధన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కోమాలోకి వెళ్లారు. అయితే ఈయన ఎన్టీఆర్ పేరు పిలిచినప్పుడల్లా తన చేతి వేళ్లను కదిలిస్తూ ఉండేవారు. అయితే ఎన్టీఆర్ అభిమాని అయినటువంటి జనార్ధన్ పరిస్థితి తెలుసుకున్న తారక్ ఏకంగా తన అభిమాని జనార్ధన్ కు ఫోన్ చేసి ఎన్టీఆర్ గొంతును జనార్ధన్ కి వినిపించారు. అదేవిధంగా ఎన్టీఆర్ జనార్దన్ తల్లితో మాట్లాడి ఆమెను ఓదార్చారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా అభిమాని ప్రమాదంలో ఉన్నారని తెలుసుకొని స్వయంగా ఎన్టీఆర్ ఫోన్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఎన్టీఆర్ పరామర్శించి తన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జనార్ధన్ తాజాగా తుది శ్వాస విడిచారు. రోడ్డు ప్రమాదానికి గురైన జనార్ధన్ తిరిగి ప్రాణాలతో బయటపడాలని ఎంతోమంది ప్రార్థించినప్పటికీ ఆ ప్రార్థనలు మాత్రం ఫలించలేదని చెప్పాలి.

చికిత్స పొందుతున్న జనార్ధన్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఇక ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.ఎన్టీఆర్ తన అభిమాని ప్రాణాలను కాపాడుకోవడం కోసం వైద్య సిబ్బందితో కూడా మాట్లాడుతూ మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు కూడా ఫలించలేదని చెప్పాలి.ఈయన మృతి చెందడంతో ఎంతోమంది అభిమానులు స్పందిస్తూ తన ఆత్మకు శాంతి కలగాలని తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.