అమరావతి లొ ప్రారంభం కానున్న “ప్రజానాయకుడు ”  

పేర్మపాటి వెంకటమ్మ సమర్పణలొ ప్రహ్లాద్, గీత్ షా జంటగా పేర్మపాటి విష్ణు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తొన్న చిత్రం “ప్రజానాయకుడు”.  వినొద్ కుమార్ , తనికెళ్ల భరణి, భానుచందర్ , జయప్రకాష్ రెడ్డి ప్రధాన పాత్రధారులు.‌ దర్శకనిర్మాత విష్ణు మాట్లాడుతూ.. నవంబర్ లొ అమరావతి లో ప్రజానాయకుడు సినిమాను ప్రారంభించనున్నాము. వైజాగ్, అరకు, అహోబిలం, బ్రహ్మం గారి మఠం తదితర ప్రాంతాలలో ఒకే షెడ్యూల్ లొ చిత్రీకరణ పూర్తి చెసి సంక్రాంతి కి సినిమాను విడుదల చెస్తామన్నారు. 

ప్రహ్లాద్, గీత్ షా,వినొద్ కుమార్ , తనికెళ్ల భరణి,భానుచందర్ , జయప్రకాష్ రెడ్డి, వైజాగ్ జనార్దన్, మణిచందన తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి కెమెరా: ఎం.జోషి, కూర్పు: హరి, సంగీతం: జి.కె, ప్రొడక్షన్ కంట్రోలర్: బాలాజీ శ్రీను, ఆర్ట్: విజయ కృష్ణ, కధ- కధనం- నిర్మాత- దర్శకత్వం: పేర్మపాటి విష్ణు.