తమన్నాకు దెయ్యం పట్టిందా లేక..

ప్రభుదేవా, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా, ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన హారర్ చిత్రం అభినేత్రి.. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నందితా శ్వేత మరో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ‘అభినేత్రి-2’, తమిళ్‌లో ‘దేవి-2’ పేర్లతో రూపొందింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌ అండ్ రెడీ రెడీ వీడియో సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా అభినేత్రి-2 అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Abhinetry 2 Trailer | 4K | Prabhu Deva | Tamannaah | Nandita Swetha | Vijay | Abhishek Pictures

ఫస్ట్ పార్ట్‌లో తమన్నాని ఆత్మ ఆవహించినట్టు చూపిస్తే, సెకండ్ పార్ట్‌లో ప్రభుదేవాకి దెయ్యం పట్టినట్టు చూపించనున్నారు. ప్రభుదేవాకి దెయ్యం పట్టడం, భార్యని వదిలేసి వేరే అమ్మాయితో క్లోజ్‌గా మూవ్ అవడం, ఇంతకీ అతనికి పట్టింది ఒక దెయ్యమా, లేక రెండు దెయ్యాలా? అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చెయ్యడం వంటి అంశాలతో ఈ ట్రైలర్ కట్ చేసారు.

కోవై సరళ, సప్తగిరిల కామెడీ ఆడియన్స్‌ని ఎంటర్‌‌టైన్ చేసేలా ఉంది. అజ్మల్ అమీర్, డింపుల్ హయతి ఇతర పాత్రల్లో నటించిన అభినేత్రి-2, మే 31న తెలుగు, తమిళ్ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.ఈ సినిమాకి కెమెరా : అయాంక బోస్, ఎడిటింగ్ : ఆంటొనీ, కొరియోగ్రఫీ : పరేష్ శిరోద్కర్, ఫైట్స్ : స్టంట్ సెల్వ.