ఇక ఇదే చివరి రోజు.. ‘రాధేశ్యామ్’కు పూజా హెగ్డే గుడ్ బై

Pooja Hegde last day Shoot In 2020 At Radheshyam

బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలా లాక్డౌన్ సమయంలో ఎక్కువగా అల్లరి చేసిన తుంటరి పిల్లలా పూజా హెగ్డే రచ్చ రచ్చ చేసింది. సోషల్ మీడియాలో పూజా హెగ్డే ఇచ్చే అప్డేట్లు, షేర్ చేసే ఫోటోలు ఎంతగానో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ షూటింగ్‌లతో బిజీబిజీగా ఉంటోంది. అయితే తాజాగా అన్ని షూటింగ్‌ల నుంచి విరామం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Pooja Hegde last day Shoot In 2020 At Radheshyam
Pooja Hegde last day Shoot In 2020 At Radheshyam

మామూలుగా పూజా హెగ్డే రాధేశ్యామ్ షూటింగ్‌లతో బిజీగా ఉంటుంది..అక్కడ షెడ్యూల్ పూర్తి అయితే.. మళ్లీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ షూటింగ్‌తో బిజీగా ఉంటుంది. అక్కడా ఇక్కడా బిజీబిజీగా తిరుగుతూ ఉంటుంది. అలా పూజా హెగ్డే ఇన్ని రోజులు షూటింగ్‌లతో సందడి చేసింది. అయితే ఇప్పుడు మాత్రం న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా పూజా హెగ్డే హైద్రాబాద్‌ను వీడేందుకు సిద్దమైంది. చివరి రోజు రాధేశ్యామ్ సెట్ నుంచి వీడ్కోలు తీసుకుంది.

రాధేశ్యామ్ షూటింగ్‌లో పూజా హెగ్డే నిన్న సందడి చేసింది. ఈ ఏడాదిలో చివరి రోజు అంటూ పూజా హెగ్డే షూటింగ్‌కు గుడ్ బై చెప్పేసింది. షూటింగ్ ముగిశాక.. హైద్రాబాద్‌కు బై బై చెప్పేసింది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా పూజా హెగ్డే తన సొంతింటికి బయల్దేరినట్టు కనిపిస్తోంది. మొత్తానికి తారలందరూ నూతన సంవత్సరం వేడుకలకు సిద్దమవుతున్నారు. అయితే కరోనా నిబంధనలతో కొందరు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ దూరంగా ఉండేట్టు కనిపిస్తోంది.