సినిమావాళ్ళ దగ్గర డబ్బు ఉండదు .. పవన్ కళ్యాణ్

ఈ మాట అన్నది హీరో , జనసేన పార్టీ అధ్యక్షుడు  పవన్  కళ్యాణ్. శ్రీకాకుళం వరద బాధితులను పరామర్శిస్తూ ఆయన చెప్పిన మాటలు  ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. సినిమావారు హడావిడి చేస్తారు తప్ప వారి దగ్గర డబ్బు ఉండదు, పేరు మాత్రం ఉంటుంది  అని చంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే డబ్బు ఉండేది లోకేష్  అచ్చం నాయుడు, కళా వెంకట్రావు , రామమోహన్ నాయుడు దగ్గరని పవన్ ఈ సందర్భంగా చెప్పాడు.

అక్కడ సర్వం కోల్పోయిన వారికి సహాయం చెయ్యాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు దృష్టికి తీసుకెడతానని అన్నాడు. పారిశ్రామిక వేత్తలను కలసి ఇక్కడి గ్రామాలను దత్తత తీసుకొమ్మని అడుగుతానని, అలాగే రామ చరణ్ ను కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చెయ్యమని ఒప్పిస్తానని హామీ ఇచ్చాడు. తానూ బాధిత కుటుంబాలకు అన్నగా ,అండగా ఉంటానని పవన్ చెప్పాడు.