నితిన్ పెళ్లికి వెళ్లొద్దు.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌లో టెన్ష‌న్

                                  మాయ‌దారి మ‌హ‌మ్మారీతో త‌స్మాత్ జాగ్ర‌త్త‌

హీరో నితిన్ ఎట్టకేలకు తన చిరకాల ప్రేయసి షాలిని కందుకూరిని జూలై 26 న వివాహం చేసుకోబోతున్నాడు. ఈ వివాహం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో జరుగుతుంద‌ని ప్ర‌చార‌మైనా హైద‌రాబాద్ ఓల్డ్ సిటీలోని ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ హోట‌ల్లో జ‌ర‌గ‌నుంద‌ని తాజాగా వెన్యూ గురించిన వివ‌రాలు తెలిశాయి. ప్రభుత్వ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, శుభ కార్యక్రమానికి సెలెక్టెడ్ గా కొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. నితిన్ తన పెళ్లికి తన అభిమాన సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా ఆహ్వానించారు.

అభిమానులు చాలా కాలం తరువాత అరుదుగా పవర్ స్టార్ ఓ సెల‌బ్రిటీ వెడ్డింగ్ లో బహిరంగ వేదిక‌పై కనిపించబోతున్నారనే విష‌యం ఉత్సాహం నింపుతున్నా.. మ‌రోవైపు హైదరాబాద్‌లో పెరుగుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసుల గురించి కూడా భయాందోళ‌న‌లో ఉన్నారు. చాలా మంది అభిమానులు సోషల్ మీడియాల్లో త‌మ ఫేవ‌రెట్ స్టార్ ఈ వివాహానికి హాజరై తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు, పవన్ పెళ్లిలో పాల్గొన్నప్పుడు ఆయ‌న‌ను బాగా చూసుకోవాల్సిందిగా నితిన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. త‌మ దేవుడు బావుండాల‌న్న ప‌వ‌న్ అభిమానుల ఆత్రుత ప్రేమాభిమానం హ‌ర్షించ‌ద‌గిన‌ది.

ఈ వెడ్డింగ్ కి ప‌వ‌న్ తో పాటు త్రివిక్ర‌మ్ అలానే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ .. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అటెండ‌వుతార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ప‌రిస్థితి చూస్తుంటే కొంద‌రు అతిథులు స్కిప్ కొట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ప‌వర్ స్టార్ కి మాత్రం ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే నితిన్ అతడికి వీరాభిమాని. వైర‌స్ కి భ‌య‌ప‌డి ప‌వ‌న్ త‌న ఫ్యాన్ ని వ‌దులుకునే ప్ర‌స‌క్తే లేదు.