బ్లాక్ బికినీలో కనపడి కుర్రాళ్లకు కసి లేపుతోంది

ఆ మధ్యన ప్రభాస్ సరసన చేయబోతోందంటూ వార్తలు వచ్చిన ముంబై భామ పరిణితి చోప్రా గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ ప్రాజెక్టు లో ఆమెను తీసుకోలేదు కానీ..మన మీడియా హడావిడితో ఆమె తెలుగు కుర్రాళ్లకు మాత్రం డార్లింగ్ అయ్యిపోయింది. ఆమె అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మనోళ్లూ ఫాలో అవుతున్నారు.  తాజాగా ఆమె మరోసారి మన మీడియాకు ఎక్కింది. ఎందుకూ అంటే ఆమె బ్లాక్ బికినీలో దుమ్ము రేపింది కాబట్టి.

రీసెంట్ గా .. ఫిలిం ఫేర్ మ్యాగజైన్ అక్టోబర్ ఎడిషన్ కోసం పరిణితి ఫోటో షూట్ చేసింది. ఫిలిం ఫేర్ కవర్ పేజిపై బ్లాక్ బికినీలో ఓ రేంజిలో రచ్చ రచ్చ
చేసింది.   సముద్రపు నీటిలో నిలబడి రెండు చేతులను పైకెత్తి జుట్టును సవరించుకున్నట్టుగా ఇచ్చిన ఫోజు ఇప్పుడు కుర్రకారుకి కసిలేపుతోంది. అప్పట్లో కాస్తంత బొద్దుగా ఉండే ఈ భామ ఇప్పుడు సైజ్ జీరో కోసం అన్నట్లు తగ్గుతూ వస్తోంది. ఆ విషయం మనం ఈ ఫొటోలో గమనించవచ్చు.

అలాగే ఆమె వరస సినిమాలు సైతం చేస్తోంది. ముఖ్యంగా అర్జున్ కపూర్ ని డేటింగ్ చేస్తున్న ఆమె ..ఆ హీరోతోనే ‘నమస్తే ఇంగ్లాండ్’.. ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ సినిమాలు  చేస్తోంది. అలాగే  అక్షయ్ కుమార్ క్రేజీ ప్రాజెక్టు   ‘కేసరి’.. సిద్ధార్థ మల్హోత్రా హీరోగా ‘జబారియా జోడి’ కూడా కమిటైంది.