యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి మనసు గురించి బయటి ప్రపంచానికి తెలిసింది కొంతే. తెలియనిది ఎంతో. అతడు ఏ దానం చేసినా దానికి అంతగా పబ్లిసిటీ కోరుకోరు. సైలెంటుగా తన సాయం ఏదో అందించి అంతే సీక్రెట్ గా ఉంచాలని అసిస్టెంట్లకు చెబుతుంటారట. అలా ఇదివరకూ చాలాసార్లు జరిగింది. అందుకే అవేవీ బయటకు అంతగా తెలీవు.
తాజాగా గోదారి లో మునక వేసిన పడవ బాధితులకు తారక్ విరివిగా విరాళం అందిస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారట. ఈ పడవ మునకలో 25 మందిని రక్షించినా మొత్తం 80 మంది వరకూ మరణించారని చెబుతున్నారు. అంటే దాదాపు 50 మంది పైగా మరణించారని ధృవీకరించవచ్చు. ఇప్పటికే 35 మృతదేహాల్ని వెలికి తీశారు. ఈ కుటుంబాల్లో అందరికీ తలో ఐదు లక్షల సాయం తారక్ తరపున అందుతుందట. అంటే కోటిన్నర వరకూ ఈ ఒక్క ఇన్సిడెంట్ పై తారక్ సాయం ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇంత సాయం చేస్తున్నా ఆయన దీనికి పబ్లిసిటీ కోరుకోకపోవడంతో ఎవరికీ తెలీదు. ఇది అత్యంత సన్నిహితుల గుసగుసల వల్ల తెలిసిన మ్యాటర్. అయితే ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. దీనిపై తారక్ కానీ.. అధికారిక పీఆర్ కానీ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది.
ప్రస్తుతం తారక్ .. భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్
లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విదేశీ షెడ్యూల్ ముగించి హైదరాబాద్ కి విచ్చేశారు తారక్.