జూ.ఎన్టీఆర్ ని అడ్డం పెట్టి, చంద్రబాబుకు ట్వీట్ దెబ్బ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఆంధ్రాలో విడుదల కానివ్వకుండా అడ్డుకోవడంతో రామ్ గోపాల్ వర్మ చాలా కోపంగా ఉన్నట్లున్నారు. దాంతో ఆ ఆగ్రహాన్ని తన ట్వీట్ల రూపంలో చూపెడుతున్నారు. తాజాగా ఆర్జీవీ తన ట్వీట్లో జూ ఎన్టీఆర్ ప్రస్తావన తేవడం ద్వారా ఎన్టీ రామారావు అభిమానులను, ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ అభిమానించే వారిని లాక్కొచ్చేసారు. ఆ ట్వీట్ ఎంత రెచ్చ గొట్టేలా ఉందంటే…ఇది కనుక జనాలు ఆలోచనలో పడేస్తే… ఓటింగ్ సరళిలో మార్పు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఆయన తన తాజా ట్వీట్ ద్వారా సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ రిక్వెస్ట్ పంపారు. ఆ ట్వీట్ లో ఏముందంటే…నిజాయతీపరులైన, అసలైన ఎన్టీఆర్ అభిమానులంతా.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు పాత్రను చూసిన తర్వాతే ఓటేయాలని ఆయన వారిని కోరారు.

అక్కడితో ఆగకుండా నారా లోకేశ్ టీడీపీకి అసలైన వారసుడు కాదన్న వర్మ.. ఆ పార్టీకి నిజమైన ఏకైక వారసుడు తారక్ అని ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్‌తోనే భవిష్యత్తు అని వర్మ ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు తలో రకంగా కామెంట్లు చేస్తున్నారు. ఏ మాత్రం ఈ ట్వీట్ ప్రభావం ఉంటుందో చూడాలి.