తల్లి పాత్రలో నిత్యా ఎందుకు నటించాల్సి వచ్చింది?

నిత్యామీనన్ బొద్దుగా ముద్దుగా ఉండే హీరోయిన్ నిత్యా మీనన్. కథ, బ్యానర్, హీరో అన్నీ పక్కన పెట్టి తనకు నచ్చిన పాత్రల్నే చేసుకుంటూ వెళ్ళింది ఇటు తెలుగు లోను అటు తమిళంలో కూడా. కధకు తగ్గట్టు లావవ్వడానికి కూడా వెనుకాడదు. అలాంటి ఈమె ప్రస్తుతం ఒక హిందీ సినిమాలో తల్లి పాత్ర కూడా చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.

హిందీ హీరో అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’ అనే సినిమా చేస్తున్నారు. మన ఇస్రో సంస్థ మార్స్ గ్రహం పైకి పంపించిన మంగళ్యాన్ ఆధారంగా చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ఉండే 5 స్త్రీ శాస్త్రవేత్తలలో ఒకరిగా నిత్యా నటిస్తున్నారు.

నిత్యా ఈ సినిమాలో ఒక శాస్త్రవేత్తగా, ఇటు తల్లిగా ఎలా విజయవంతంగా నెట్టుకురాగలిగిందో చూపిస్తారట. ఇంకా ఈ సినిమాలో విద్య బాలన్, తాప్సి పన్ను, సోనాక్షి సిన్హా, కీర్తి కొల్హారి నటిస్తున్నారట. ఈ సినిమా ఆగష్టు 15 న విడుదల కానుంది.

తల్లి పాత్రలో ఎందుకు నటించాల్సి వచ్చిందని అడిగితే వయసుకు మించిన పాత్రలలో నటిస్తేనే మనలోనే నటనా సామర్థ్యం బయటపడుతుందని సమాధానమిచ్చింది నిత్యామీనన్