రూట్ మార్చాడు : ‘గీత గోవిందం’ స్కీమ్ లోకి నితిన్

కొన్ని సినిమాలు స్పీడుగా వెళ్తున్న దర్శకుల కెరీర్ లకు సడెన్ బ్రేక్ లు వేస్తూంటాయి. అలాంటి బ్రేకే రీసెంట్ గా నితిన్ కు పడింది. దిల్ రాజు బ్యానర్ లో వేగేశ్న సతీష్ దర్శకత్వంలో రూపొందిన శ్రీనివాస కళ్యాణం చిత్రం డిజాస్టర్ అవ్వటం ఆయన ఊహించని పరిణామమే. ఈ సినిమా దెబ్బకు నితిన్ పూర్తి స్దాయి ఆలోచనలో పడ్డాడు.

దాంతో ఆ సినిమాకు పూర్తి భిన్నమైన సినిమాలు ఎన్నుకునే పోగ్రాం పెట్టుకున్నాడు. ఆర్ ఎక్స్ 100 దర్శకుడుతో ఓ చిత్రం సెట్ చేయాలని ప్రయత్నించిన నితిన్ అది లేటయ్యేటట్లు ఉండటంతో ‘కుమారి 21 ఎఫ్‌’తో హిట్ అందుకొన్న దర్శకుడే పల్నాటి సూర్యప్రతాప్ తో చేయటానికి ఓకే చేసాడు‌.

పల్నాటి సూర్యప్రతాప్ పలు చిత్రాలకి సుకుమార్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థతో కలిసి, ‘గీత గోవిందం’తో విజయాన్ని అందుకొన్న బన్నీ వాస్‌ జీఏ 2 పతాకంపై నిర్మించబోతున్నారు.

విభిన్నమైన కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చనున్నట్టు సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు నితిన్‌. అది పూర్తయ్యాక, సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.