“నేను c/o నువ్వు” మూవీ టీజర్ లాంచ్

అగాపే అకాడ‌మీ బ్యాన‌ర్‌లో రూపొందుతున్న చిత్రం “నేను c/o నువ్వు.” సాగారెడ్డి తుమ్మా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కిషోర్‌, సానియా సిన్యా, బాషా త‌దితరులు న‌టిస్తున్నారు. 

1980వ ద‌శాబ్ద‌పు య‌దార్ధ ప్రేమ‌క‌థ ఆధారంగా తీసిన చిత్ర‌మిది. ఈ చిత్ర టీజర్ ఈరోజు   ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో విడుద‌ల అయింది.

ఈ సందర్భంగా సాగారెడ్డి మాట్లాడుతూ…రెండు సంవ‌త్స‌రాల నుంచి ఈ చిత్రం నిర్మాణంలో వుంది . ఇది కేవ‌లం నా ఒక్క‌డి చిత్రం కాదు నా ఫ్రెండ్స్‌, పార్ట‌న‌ర్స్ కూడా ఉన్నారు. మ‌న జీవితంలో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌ల్లో మ‌నం  రియాక్ట్ అవుతాం మరి కొన్నింటి విషయంలో  రియ‌లైజ్ అవుతాం. ఈ చిత్రం కోసం మా  టీమ్ మొత్తం చాలా హెల్ప్ చేసింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌  ర‌ఘునాధ్‌ గారిని ఈ చిత్రం ద్వారా  నేను ప‌రిచ‌యం చేశాము .  ద‌య‌చేసి ఈ చిత్రంలోని డైలాగ్స్‌ని ఎవ‌రూ ప‌ర్స‌న‌ల్‌గా తీసుకోవ‌ద్దు. నేను రెడ్డిని కాబ‌ట్టి ఆ క్యాస్ట్‌ని వెన‌కేసుకొచ్చాను అని అనుకోవ‌ద్దు. అంద‌రూ ఈ చిత్రాన్ని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.

 

స‌హ‌నిర్మాత‌లు మాట్లాడుతూ… ఈ చిత్రం తియ్య‌డానికి సాగారెడ్డి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. మాకు కంటెంట్ బాగా న‌చ్చి ఈ చిత్రం చెయ్య‌డానికి ఒప్పుకున్నాం త‌ప్ప‌కుండా ఈ చిత్రం స‌క్సెస్ సాధిస్తుంద‌ని  అన్నారు.

ఏ చిత్రంలో న‌టీన‌టులుః కిషోర్‌, సానియాసిన్యా, బాషా, ర‌వింద‌ర్‌, విన‌య్‌, రాధాకృష్ణ‌, ధ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.  సాంకేతిక నిపుణులుః కెమెరామెన్ జి.కృష్ణ‌ప్ర‌సాద్‌, ఎడిటింగ్ః ప్ర‌వీణ్‌పుడి, కళ ) పి.ఎస్‌.వ‌ర్మ‌, పాటలు ప్ర‌ణవం, క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంఃసాగారెడ్డి, స‌హ‌నిర్మాత‌లుఃఎం.డి.అతుల్, త‌మ్మ‌దుర్గేష్‌రెడ్డి, కొండ శ‌శిరెడ్డి.