‘వి’  రాక  ఇక లేనట్టే !

నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు కలయికలో రాబోతున్న ‘వి’ చిత్రం ఓటిటిలోకి రాబోతుందని తెగ రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ రూమర్లలో కనీస నిజం కూడా లేదట. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ భారీ మొత్తం ఆపర్ చేసినా చిత్రబృందం కమిట్ అవ్వలేదు. అన్నట్టు ఈ సినిమా ఎండింగ్ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. అసలు ఈ సినిమా కథకు ముగింపు ఉండదని.. అంటే సినిమా ముగిసిన చోట నుండే మరో కొత్త కథ స్టార్ట్ అయ్యేలా టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి తన కథను రాసుకున్నాడని తెలుస్తోంది.

మరి ఇంద్రగంటికి ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన ఉందేమో. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉండటానికి అవకాశం ఉన్నా హీరోలు మళ్ళీ కలిసి చేస్తారా అన్నది డౌటే. కానీ ఈ సినిమాకొచ్చే సక్సెస్ ను బట్టి సీక్వెల్ ఉంటుందా లేదా అనేది డిసైడ్ అవుతుందనుకోండి. ఇక ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు మ‌ధ్య నువ్వా నేనా? అనేలా యాక్ష‌న్ సీన్స్ ఉంటాయని.. నటనలో నాని డామినేట్ చేసినా.. యాక్షన్ సీక్వెన్స్ లో సుధీర్ బాబు డామినేట్ చేస్తాడని టాక్.

కాగా ఈ సినిమాలో ఇద్దరి హీరోల పాత్రలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయట. అసలు ఇంద్రగంటి అంటేనే వైవిధ్యం. పైగా హీరోను చాలా సహజంగా చూపిస్తాడు. నానితో చేసిన రెండు సినిమాల్లోనూ నానిని డిఫ‌రెంట్‌ యాంగిల్ లో చూపించి సక్సెస్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు నానిని విలన్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రిస్తూ.. నాని నటనా జీవితంలోని మరో కోణాన్ని పరిచయం చేయబోతున్నాడు. అలాగే సుధీర్‌బాబును ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ రోల్‌ లో చూపిస్తూ సుధీర్ బాబును బాగానే హైలైట్ చేస్తున్నాడు. నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా రాబోతుంది.