నాగ్ కూడా నెట్ లో చూసి అర్దం చేసుకోవాల్సివచ్చింది,రేపు జనం పరిస్దితి?

 ఏదో వింత జబ్బుతో సినిమా చేస్తే ..జనాల్లో ఆసక్తి రేపి హిట్ కొట్టచ్చు అనే ఆలోచన దర్శక,నిర్మాతల్లో ఈ మధ్యకాలంలో మొదలైంది. ఎప్పుడూ అవే రొటీన్ కథ చెప్తూ..మాస్, లవ్ ,ఫైట్స్ అంటూ చుట్టేసేకన్నా ఓ కొత్త ఆలోచనతో ఆలోచనలో పడేయాలని అనుకోవటం శభాషైన ఆలోచనే. ఇప్పుడు `స‌వ్య‌సాచి` అదే పని చేస్తున్నాడు. రీసెంట్ గా `స‌వ్య‌సాచి` టీమ్ ట్రైలర్ విడుదల చేసింది. అది చూసిన వారంతా అందులో ఏదో విషయం ఉందని అర్దం చేసుకున్నారు. కాకపోతే అదేంటన్నది క్లారిటీ రాలేదు. ఈ విషయం టీమ్ కు అంటే దర్శకుడు,హీరోకు తెలిసినట్లుంది. దాంతో దర్శకుడు వివరణ ఇచ్చి జనాల్లో ఉన్న అయోమయాన్ని తొలిగించే ప్రయత్నం చేసారు.

చందు మొండేటి మాట్లాడుతూ.. ఈ సమస్యను వ్యానిషంగ్ ట్విన్ సిండ్రోమ్ అంటారు. ఈ స‌మ‌స్య మన ఊహకన్నా చాలా పెద్ద‌ది. అసలు అలాంటిది ఒక‌టి ఉంద‌ని మొదట మాకూ తెలియదు కానీ రీసెర్చ్ చేసాక తేలింది. మొదట చైతన్య కోసం క‌థ అనుకున్నప్పుడు ఇంకేదైనా డిఫెరెంట్ ఉండాలి అని భావిస్తూంటూ తగిలిన ఓ ఆర్టిక‌ల్ చ‌దివాను. అందులో వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే దాని గురించి స్పష్టంగా రాసుకొచ్చారు.

అక్కడ నుంచి దానిపై రీసెర్చ్ చేస్తూ .. ఆ పాయింట్ ని క‌థ‌లో ఇన్‌బిల్ట్ చేసుకున్నా. అదే స‌వ్య‌సాచి లెఫ్ట్ హ్యాండ్ క‌ద‌లిక‌ల‌కు దారి తీస్తుంది. ఈ విషయం గురించి కింగ్ నాగార్జున‌, మాధ‌వ‌న్ తో పాటు మైత్రి సంస్థ అధినేత‌లు అంద‌రూ ఇంటర్నెట్ లో చూసి తెలుసుకున్నారు. మాధ‌వ‌న్ ఈ క‌థ విన్న త‌ర్వాత ఇది తీసిపారేసేది కాదు.. ఇందులో సంథింగ్ ఏదో ఉంది అనుకున్న త‌ర్వాత‌నే ఓకే చేసారు. అంతెందుకు సుకుమార్ అంత‌టి సెన్సేష‌న‌ల్ ద‌ర్శ‌కుడు ఈ క‌థ విని న‌చ్చింది.. నేను చేయ‌లేదు అన్నారంటే మీరే ఆలోచించండి.. అని అన్నారు. అదీ విషయం.

నాగచైతన్య అక్కినేని, హ్యాట్రిక్ డైరెక్టర్ చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సవ్యసాచి”. మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. మాధవన్, భూమికలు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

‘బాహుబలి’ తర్వాత ఎం.ఎం.కీరవాణి సంగీత సారధ్యం వహిస్తున్న చిత్రం ఇదే. “రంగస్థలం” వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం అందించిన మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌లో “సవ్యసాచి” రూపుదిద్దుకోవటంతో బిజినెస్ వర్గాల్లోనూ క్రేజ్ పుంజుకుంది.