ట్రైలర్ చూస్తే…ఆ ప్లాఫ్ సినిమా గుర్తు వస్తోందే

అక్కినేని అఖిల్ న‌టిస్తున్న మూడో సినిమా మిస్ట‌ర్ మ‌జ్ను. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ చిత్రానికి …. బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌. ఈనెల 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా రిలీజ‌వుతోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా ట్రైల‌ర్ ని లాంచ్ చేశారు. అయితే ట్రైల‌ర్ చూసిన వాళ్లలో కొందరు రామ్ చరణ్ డిజాస్టర్ సినిమా ఆరెంజ్ గుర్తుకు వస్తోందని సోషల్ మీడియాలో కామెంట్ చేసారు.

కంటెంట్ పరంగా ఆ సినిమా గుర్తుకు వస్తోందని, ప్రేమ దాకా ఓకే పెళ్లి అంటే కష్టం అంటూ కమిట్మెంట్ దూరంగా ఉండే పాత్రను అఖిల్ చేస్తున్నాడని, అదే రామ్ చరణ్ ..ఆరెంజ్ లో చేసాడు అంటున్నారు. అప్పట్లో ఆ థీమ్ కొంతమందికి కుర్రాళ్లకు నచ్చినా …ఎక్కువ మంది కనెక్టు కాలేకపోయారని, కాలం మారింది కాబట్టి ఈ సారి వర్కవుట్ అవుతుందేమో అంటున్నారు.

ఇక ఈ ట్రైల‌ర్ మొదట నుంచీ చివరి వరకూ అక్కినేని స్టైల్ రొమాంటిక్ ల‌వ్ స్టోరి గా నడిపారు. ట్రైల‌ర్ లో అఖిల్ స్టైలిష్ గా క‌నిపించాడు. నిధి అగ‌ర్వాల్ హాట్ అప్పీల్ ఆక‌ట్టుకుంటే… అమ్మాయిల వెంట‌ప‌డే అల్ల‌రి కుర్రాడు విక్కీ నిధిని ప‌డేసేందుకు ఎలాంటి టెక్నిక్స్ ఉప‌యోగించాడు? చివ‌రికి త‌న‌కు చేత‌కాని ప్రేమ వ‌ల‌లో చిక్కుకుని ఎలా విల‌విల‌లాడాడు? అన్న థీమ్ తో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిద‌ని ట్రైల‌ర్ ని బట్టి అర్దమవుతోంది.

ఇక నిధి అగ‌ర్వాల్ అంద‌చందాలు అస్సెట్ కానున్నాయి. ఇక వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని ఏ స్థాయిలో ఎమోష‌నల్ ల‌వ్ స్టోరిగా తీర్చిదిద్దాడు? అన్న‌దానిని బ‌ట్టే హిట్ స్దాయి ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే ఇక ట్రైల‌ర్ లో ఎక్క‌డా ఎమోష‌న్ అన్న‌ది వ‌ర్క‌వుట్ కాలేదు. కేవలం రొమాంటిక్ మూడ్ ని మాత్రం క్యారీ చేస్తోంది. మ‌రి ఈ మ‌జ్ను క‌థేంటో ఈనెల 25న తెలుస్తుంది. అంత‌వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.