హీరో మోహన్ బాబు ఇంట్లో విషాదం

టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మోహన్ బాబు తల్లి లక్ష్మమ్మ  గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మమ్మ తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ లో గురువారం ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు.

తల్లిదండ్రులతో మోహన్ బాబు

ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు విషయం తెలియగానే ఇండియాకు బయల్దేరారు. శుక్రవారం తిరుపతిలో లక్ష్మమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. లక్ష్మమ్మ మృతికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.