జగన్ గెలుపుపై మోహ‌న్‌బాబు కామెంట్

గత కొంతకాలంగా జగన్ మోహన్ రెడ్డి కు సపోర్ట్ చేస్తూ వస్తున్న మంచు మోహన్ బాబు ఈ రోజు ఫలితాలు చూసి కామెంట్ చేసారు. ఆయన తన కామెంట్ లో జగన్ పై తన నమ్మకాన్ని వ్యక్తం చేసారు. పాదయాత్రే గెలిపించింది అన్నారు.

మోహన్ బాబు మాట్లాడుతూ….ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే.. శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తన బిడ్డ జగన్ కి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చారు. జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రజలు ఆశీస్సులు అందచేసి ముఖ్యమంత్రిని చేశారు. కచ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్ అన్నారు.

ఇక మోహన్ బాబు కుటుంబానికి జగన్ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులు కూడా జగన్ కి మద్దతుగా నిలిచారు. అలాగే రెండు కుటుంబాలకు బంధుత్వం కూడా ఉంది. ఈ ఎన్నికల్లో జగన్ గెలవడం ఖాయమని మోహన్ బాబు ముందే చెప్పారు మోహన్ బాబు.