అఫీషియల్ : “యాత్ర 2” లో వై ఎస్ జగన్ గా అతడే..

ప్రస్తుతం ఏపీ లో చాలా వరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు చిత్రాల్లో ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ సహా తన తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల జీవిత చరిత్రపై తెరకెక్కించిన చిత్రం “యాత్ర 2” కూడా ఒకటి. అయితే గత ఎన్నికల్లో రిలీజ్ చేసిన మొదటి భాగం మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ చిత్రం తర్వాత ఈ రానున్న 2024 ఎన్నికలకి గాను యాత్ర 2 ని చేస్తున్నారు.

ఇక ఇది బాగున్నప్పటికీ ఈ చిత్రంలో జగన్, వై ఎస్ ఇద్దరి పాత్రలు కనిపించనుండగా ఆల్రెడీ వై ఎస్ పాత్రలో ఎయిర్ మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించగా ఈసారి జగన్ రోల్ ఎవరు చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. అయితే జగన్ పాత్రలో తమిళ య్యువ నటుడు జీవా కనిపిస్తాడు అని ఇది వరకే చాలా రూమర్స్ ఉన్నాయి.

ఇక వీటితో చిత్ర యూనిట్ ఇవాళ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక ఇప్పుడు విడుదల అయ్యిన పోస్టర్ తో అయితే జగన్ పాత్రని నటుడు జీవానే పోషిస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మమ్ముటి జీవ ఇద్దరిపై పోస్టర్ ని డిజైన్ చేశారు. దీనితో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ ప్రశ్నకి నేడు సమాధానం దొరికింది.

ఇక ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇదే పోస్టర్ తో మేకర్స్ ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు.