మెగా డాట‌ర్స్ కు షాక్.. అస‌లు మ్యాట‌ర్ ఇదే !

టాలీవుడ్‌ లో మెగా కాంపౌండ్ నుండి అప్‌లోడ్ అయిన వాళ్ళందరూ హీరోలుగా దూసుకుపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి వేసిన బాట‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్, వ‌రుణ్ తేజ్, సాయి ధ‌ర‌మ్ తేజ్, ఇలా మెగా హీరోలంతా వెండితెర‌ పై స‌త్తా చాటుతుండ‌గా, కొత్త‌గా వైష్ణ‌వ్ తేజ్ కూడా ఉప్పెనతో టాలీవుడ్‌లో అన అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

అయితే మెగా హీరోలు స‌క్సెస్ అయినా, మెగా డాట‌ర్స్ కు మాత్రం ఎందుకో క‌లిసిరావ‌డంలేదు. బుల్లితెర‌తో పాటు వెండితెర ఎంట్రీ ఇచ్చిన, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూతురు నిహారికకు నిరాశే ఎదురైంది. బుల్లితెర పై ప‌ర్వాలేద‌నిపించినా, వెండితెర‌ పై మాత్రం పూర్తిగా తేలిపోయింది. నిహారిక న‌టించిన చిత్రాల‌న్నీ ప్లాప్ అవ‌డంతో, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు మ‌రో అవ‌కాశం ఇచ్చేందుకు ముందుకు రావ‌డంలేదు. దీంతో సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి, పెళ్లికి సిద్ధ‌మైంది నిహారిక‌.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ఇండ‌స్ట్రీలో కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేసిన సుష్మిత తాజాగా ప్రొడ్యూస‌ర్‌గా మ‌రింది. తొలుత వెబ్‌సిరీస్ ప్లాన్ చేసిన మెగా డాట‌ర్‌కు క‌రోనా ఊహించ‌ని షాక్ ఇచ్చింది. క‌రోనా లాక్‌డౌన్ స‌డ‌లింపుల్లో భాగంగా షూటింగుల‌కు ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌డంతో ఓ వెబ్‌సిరీస్‌ ను స్టార్ట్ చేసేందుకు, గ్రాండ్‌ గా లాంచ్ చేసింది సుష్మిత‌.

అయితే క‌రోనా కాలంలో డేరింగ్‌గా వెబ్ సినీస్ షూటింగ్ స్టార్ట్ చేసిన సుష్మిత‌కు క‌రోనా షాక్ ఇచ్చింది. త‌న టీమ్‌లోకి కొంద‌రికి క‌రోనా సోక‌డంతో ఉన్న‌ప‌లంగా వెబ్ సిరీస్ నిర్మాణాన్ని ఆపేయాల్సి వ‌చ్చింది. త‌న టీమ్‌లో ఉన్న‌వారికే క‌రోనా అంటుకోవ‌డంతో సుష్మిత కూడా హోమ్ ఐసోలేష‌న్‌లో ఉండాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో ఎంత ఆవేశంతో ఈ వెబ్ సిరీస్‌ను స్టార్ట్ చేసిన సుష్మిత, చివరికి ఊహించ‌ని విధంగా బుక్కైంది. దీంతో నిర్మాత‌గా గ్రాండ్ ఎంట్రీ ఇద్దామ‌నుకున్న ఈ మెగా డాట‌ర్ ఆశ‌ల పై క‌రోనా నీళ్ళు చ‌ల్లింది పాపం.