రిస్క్ ఎందుకని.. రజనీనే ఫైనల్ చేసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే..ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట మహేష్ ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు.

ఈ నిర్మాణం.., దాదాపు పూర్తి కావొచ్చింద‌ని తెలుస్తుంది. పూర్తైన సినిమా థియోటర్ ని ఏ సినిమాతో ఓపెన్ చెయ్యాలనేది ఎప్పుడూ పెద్ద క్వచ్చినే. ఎందుకంటే మొదటి సినిమా సూపర్ హిట్ తమ థియోటర్ లో ఆడాలని ఎవరైనా కోరుకుంటారు. మహేష్ సైతం అదే కోరుకున్నారు. అందుకోసం ఆయన మొదట అమీర్ ఖాన్ సినిమా థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ తో ప్రారంభిద్దాం అనుకున్నారు. అమీర్ ఖాన్ ని గెస్ట్ గా కూడా పిలుద్దామని అనుకున్నారు.

థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంతోనే మ‌ల్టీ ప్లెక్స్‌ని ప్రారంభించాల‌ని అనుకున్న‌ప్ప‌టికి , నిర్మాణం పూర్తి కాక‌పోవ‌డంతో వాయిదా వేశారు. ఇక న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానున్న భారీ బ‌డ్జెట్ చిత్రం 2.0 చిత్రంతో ఏఎంబీ మల్టీప్లెక్స్‌ను మహేష్ ప్రారంభించాలని అనుకుంటున్నారని సమాచారం .

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన మల్టీప్లెక్స్ కావటంతో ‘2.ఓ’ లాంటి 3డీ విజువల్‌, 4డీ ఆడియోతో రూపొదించిన సినిమా అభిమానుల‌కి పండుగలా ఉంటుందని భావిస్తున్నారు.

దాంతో ఈ మ‌ల్టీ ప్లెక్స్ ప్రారంభానికి ర‌జ‌నీకాంత్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌వుతాడ‌ని అనే టాక్ మొదలైంది. రజనీరావటమే క‌నుక నిజ‌మైతే ఫ్యాన్స్ కు పండగే కదా. మ‌హేష్ ప్ర‌స్తుతం మ‌హర్షి అనే సినిమాతో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.