మ‌హేష్-ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్.. అల్లు బాస్ మ‌ళ్లీ..

                                   ఇదే నిజ‌మైతే ఫ్యాన్స్ కి పెద్ద పండ‌గే

సూప‌ర్ స్టార్ మ‌హేష్ .. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నుందా? అంటే అవున‌నే స‌మాచారం. అందుకు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మ‌హేష్.. తార‌క్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వచ్చేసింది. ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌తో స్క్రిప్టుల్ని వండే ప‌నిలో ఉన్నార‌ని కూడా తాజాగా స‌మాచారం లీకైంది.

వాస్త‌వానికి ఈ కాంబినేషన్ సినిమాకి ప్ర‌య‌త్నించ‌డం ఇదే తొలిసారి కాదు. అల్లు అర‌వింద్ చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ ఇద్ద‌రి కాల్షీట్ల స‌ర్ధుబాటు అన్న‌ది చిక్కులు తెచ్చి పెట్టింది. అప్ప‌ట్లో బ‌న్నీనే స్వ‌యంగా మ‌హేష్‌- తార‌క్ సినిమాని నిర్మించేందుకు ముందుకు వ‌చ్చారు. కానీ కుద‌ర‌లేదు. ఈసారి బ‌న్నీకి ఏ సంబంధం లేదు కానీ అర‌వింద్ మాత్రం క‌థంతా ముందుండి న‌డిపిస్తార‌ట‌.

ఒక‌వేళ ఇదే నిజ‌మైతే మ‌హేష్.. తార‌క్ ఫ్యాన్స్ కి పండ‌గే. ఇది అరుదైన క‌ల‌యిక‌. ఎగ్జ‌యిట్ మెంట్ పెంచే కంటెంట్ తో ఈ మూవీ ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రూ సౌతిండియా స్టార్లుగా అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. హిందీలో మార్కెట్ పెంచుకునే ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అర‌వింద్ ఆ ఇద్ద‌రినీ క‌లిపే ప్ర‌య‌త్నం చేయడం ఉత్కంఠ పెంచుతోంది.