లేటెస్ట్ అప్డేట్ : కృష్ణంరాజు అంత్యక్రియలపై పూర్తి డీటెయిల్స్!

టాలీవుడ్ నటులు మరియు నిర్మాత ఉప్పలపాటి కృష్ణం రాజు ఈరోజు తెల్లవారు జామున తన తుది శ్వాస విడిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఊహించని విషాద ఘటనతో ఒక్కసారిగా టాలీవుడ్ సహా ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా తీరని లోటు గా మారింది.

మరి దీనితో కృష్ణం రాజు ఇంటికి ఈరోజు ఉదయం నుంచే సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ మహేష్ బాబు, నాని తదితరులు చేరుకొని ప్రభాస్ ని ఓదార్చి ధైర్యం చెప్పారు. అయితే వారితో పాటుగా తెలుగు రాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వారి ఇంటికి వెళ్లి సంతాపం వ్యక్తం చేశారు.

మరి ఇదిలా ఉండగా ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఇప్పుడు వారి కుటుంబం నుంచే మీడియా వారికి ఒక క్లారిటీ అయితే అందింది. వారు చెబుతున్న దాని ప్రకారం అయితే కృష్ణం రాజు గారి అంత్యక్రియలు రేపు జరుగుతాయని..

అలాగే అది కూడా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోనే ఉంటాయని మధ్యాహ్నం 1 గంట సమయంలో వారి పార్థివ దేహాన్ని అంతిమ యాత్ర చేసి మహా ప్రస్థానంలో హిందూ సంప్రదాయాలు ప్రకారం జరుపుతారని తెలిపారు. దీనితో అయితే ఈ అంశంలో అందరికీ ఒక క్లుప్తమైన సమాచారం దొరికింది.