మెగాస్టార్ మైండ్ లో కేజీఎఫ్ కెప్టెన్!

రెండ‌వ సినిమాతోనే విమ‌ర్శ‌కుల ప్ర‌శంలందుకున్నాడు కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్. చిన్న సినిమాగా రిలీజ్ అయిన సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఊహించ‌ని స‌క్సెస్ ని అందుకుంది. ఒక్క హిట్ ఆ సినిమా హీరో, డైరెక్ట‌ర్ల కెరీర్ నే మార్చేసింది. ప్ర‌శాంత్ పై ఇప్పుడు టాలీవుడ్ హీరోలంద‌రీ దృష్టి ప‌డింది. అత‌నితో సినిమాలు చేయాల‌ని టాప్ స్టార్లు అంతా ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్ప‌ట‌కే ఈ రేసులో ఎన్టీఆర్, ప్ర‌భాస్, మ‌హేష్, రామ్ చ‌ర‌ణ్ ల పేర్లు వినిపించాయి. అటు బాలీవుడ్ హీరోలు ప్ర‌శాంత్ తో సినిమా చేయాల‌ని ఆస‌క్తి చూపిస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. మెగాస్టార్ మైండ్ లో ప్ర‌శాంత్ నీల్ ఉన్నాడ‌ని ఆ కాంపౌడ్ వ‌ర్గాల నుంచి లీకైంది. కుదిరితే ముందుగా చ‌ర‌ణ్ తో ఓ సినిమా చేయించి అటుపై చిరుకూడా ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని భావిస్తున్నా రుట‌. ప్ర‌శాంత్ ట్యాలెంట్ ను మెగాస్టార్ పూర్తిగా స్ట‌డీ చేసిన త‌ర్వాత ఈ డెసిష‌న్ తీసుకున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ప్ర‌శాంత్ క‌న్న‌డ‌లో ఉగ్రం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమాతోనే మేకింగ్ తో పాటు రైంటింగ్ పైనా మంచి క‌మాండ్ ఉన్న టెక్నీషీయ‌న్ గా నిరూపించుకున్నాడు. అటుపై కేజీఎఫ్ తో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ అయిపోయాడు.

ఈ రెండు సినిమాల స్ర్కిప్ట్ ను సిద్దం చేయ‌డంలో ప్ర‌శాంత్ బోలెడంత రీసెర్చ్ చేసాడు. అటుపై ఆ క‌థ‌కి క‌మ‌ర్శియ‌ల్ రూపం తీసుకురావ‌డంలో నూరుశాతం స‌క్సెస్ అయ్యాడు. ఆ ట్యాలెంట్ ని గుర్తించే టాలీవుడ్ టాప్ స్టార్లు అత‌ని వెంట ప‌డ‌టం మొద‌లు పెట్టారు. తాజాగా సూప‌ర్ సీనియ‌ర్ చిరు కూడా ప్ర‌శాంత్ పై ఆస‌క్తి చూపించ‌డం మ‌రో విశేషం. అంతేగా! ట్యాలెంట్ ఉంటే అపేది ఎవ‌రు? వెతుక్కుంటూ మ‌రీ అవ‌కాశాలు వ‌స్తాయి అన‌డానికి ప్ర‌శాంత్ బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నాడు.