అక్రమ సంభందం, మర్డర్ కేసులో ‘కేజీఎఫ్’ టీమ్ వ్యక్తి

మర్డర్ కేసులో ‘కేజీఎఫ్’ స్టంట్ మ్యాన్

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్‌ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. హీరో యష్ పర్‌ఫార్‌మెన్స్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. ఈ ఊపులో రీసెంట్ గా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ని మొదలు పెట్టేసింది టీమ్. అయితే ఈ సినిమా టీమ్ కి చెందిన ఓ వ్యక్తి ఒక హత్య కేసులో ఇరుక్కుని వార్తల్లో నిలిచాడు.

పోలీస్ ల నుంచి అందిన సమాచారం మేరకు ..రఘు అనే వ్యక్తి కేజీఎఫ్ కోసం స్టంట్ మాన్ గా పనిచేశాడు. రఘు ఒక వ్యక్తిని చంపి అతని శరీరాన్ని కారుతో పాటు కాల్చివేసినట్టు తెలుస్తోంది. రఘు స్నేహితురాలు అయిన ఓ మహిళతో హత్యకు గురైన వ్యక్తి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా అతడు ఆ మహిళతో తాను ఉన్న వీడియోలతో ఆమెను బెదరిస్తున్నాడు. ఈ విషయాన్ని సదరు మహిళ రఘుకు చెప్పగా రఘు… సిద్ధు అనే మరో స్నేహితుడితో కలిసి ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తిని చంపేశారు.

ప్రస్తుతానికి ఆ మహిళతో పాటు రఘు – సిద్ధు రిమాండ్ లో ఉన్నారు. నిందితురాలిగా ఉన్న కేజీఎఫ్ స్టంట్ మ్యాన్ రఘు స్నేహితురాలి కథనం ప్రకారం హత్యకు గురైన వ్యక్తి తనతో పాటు చాలా మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పింది. ఇక రఘు కన్నడ సినిమా పరిశ్రమలో కేజీఎఫ్ తో పాటు పలు సినిమాలకు స్టంట్ మ్యాన్ గా పనిచేశాడు. ఇక ఇప్పుడు హత్య కేసులో చిక్కుకుని వార్తల్లో కెక్కాడు.