క‌త్రిన సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుందా

క‌త్రిన సీక్రెట్ ల‌వ్ గురించి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా ఒంట‌రి స్టాట‌స్ తో దిగాలుగా ఉన్న క‌త్రిన ఉన్న‌ట్టుండి యువ‌హీరో విక్కీ కౌశ‌ల్ తో ల‌వ్ లో ప‌డిందని వార్త‌లొస్తున్నాయి. ఆ ఇద్ద‌రూ నైట్ పార్టీల్లో క‌లుసుకోవ‌డంపై ఇప్ప‌టికే బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. ఒక‌రినొక‌రు వీడి ఉండ‌లేనంత సాన్నిహిత్యాన్ని ఈ జంట కొన‌సాగిస్తున్నార‌ని.. విక్కీ ఇంట్లో క‌త్రిన అంద‌రితో క‌లిసిపోయింద‌ని టాక్ వినిపిస్తోంది.

ఇంత‌లోనే ఉన్న‌ట్టుండి క‌త్రిన బ్రైడ‌ల్ లుక్ లో క‌నిపించి షాకిచ్చింది. న‌వ‌వ‌ధువుగా మారిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ కావ‌డంతో క‌త్రిన‌కు పెళ్ల‌యిపోయింది. గుట్టుగా చేసేసుకుందా? అంటూ ఒక‌టే షాక్ తిన్నారంతా. అయితే ఇదంతా ఓ బంగారం షాపు ప్ర‌క‌ట‌న కోసం హ‌డావుడి అని తాజాగా తెలుస్తోంది. ఈ ప్ర‌క‌ట‌న‌లో అమితాబ్, జ‌యాబ‌చ్చ‌న్ దంప‌తులు స‌హా నాగార్జున‌, ప్ర‌భు, రాజ్ కుమార్ త‌దిత‌రులు న‌టించారు. ఇక ఆభ‌ర‌ణాలు తొడుక్కుని వ‌ధువు గెట‌ప్ లో క‌త్రిన కూతురుగా క‌నిపిస్తుంద‌ట‌. త‌న‌కు త‌ల్లిదండ్రులుగా అమితాబ్, జ‌యాజీ క‌నిపిస్తార‌ని.. ఈ పెళ్లిలో అతిధులుగా నాగార్జున ఇత‌రులు క‌నిపిస్తార‌ని చెబుతున్నారు. ఈ వివ‌రం తెలియ‌గానే హ‌మ్మ‌య్య క‌త్రిన‌కు ర‌హ‌స్య వివాహం జ‌ర‌గ‌లేదు క‌దా అంటూ ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్.