ఫ్లాష్ న్యూస్ : రకుల్ ‌కు కరోనా పాజిటివ్!

Rakul Preet Singh

 

సినీ ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే అమితాబ్, రాజమౌళి, తమన్నా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి వాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. అమితాబ్, రాజమౌళి,తమన్నా కరోనా నుంచి కోలుకున్నా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాత్రం కరోనా కారణంగా కన్నుమూసారు.

ఆ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది. తాజాగా ఆమె చేయించుకున్న కరోనా నిర్దారణ పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రకుల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని తెలిపింది.

 

`నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా. ఈ మధ్య నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండ`ని రకుల్ పేర్కొంది.