ప్రభాస్ ని ప్రక్కన పెట్టి విజయ్ దేవరకొండతో ..?

విజయ్ దేవరకొండ క్రేజ్ రోజు రోజుకు రెట్టింపు అవుతోంది. అతి తక్కువ కాలంలో యూత్ లోకి దూసుకుపోయిన హీరో అతను. అతనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం వేయకమానరు. ఒక్కో సినిమా హిట్ ఒక్కో రికార్డ్ బ్రద్దలు కొడుతున్నాడు.

టాక్సీవాలా సినిమా రిలీజ్ కు ముందే లీక్ అయినా హిట్ టాక్ తెచ్చుకోవటం ,ఆ తర్వాత కలెక్షన్స్ కుమ్మేయటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ నేపధ్యంలో పెద్ద పెద్ద నిర్మాతల దృష్టి ఆయనపై పడుతోంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరుణ్ జోహార్ దృష్టి విజయ్ దేవరకొండపై పడినట్లు సమాచారం.

కరణ్ గత కొంత కాలంగా ప్రభాస్ తో హిందీలో ఓ సినిమా చేయాలని ప్లానింగ్ లో ఉన్నారు. అయితే ప్రభాస్ పెద్దగా ఉత్సాహం చూపెట్టక, వరసపెట్టి రెండు తెలుగు సినిమాలు కమిటయ్యారు. టాలీవుడ్ లోనే కంటిన్యూ అవటానికి ఇష్టపడుతున్నారు. డైరక్ట్ హిందీ సినిమా చేయటానికి ఆయన ఆసక్తి చూపెట్టడం లేదు. ఈ నేపధ్యంలో కరణ్ జోహార్ ..విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

దానికి తోడు ఈ మధ్యకాలంలో శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ ..తాను విజయ్ దేవరకొండతో సినిమా చేయాలన్నట్లు గా మాట్లాడింది. ఇది గమనించిన కరణ్ జోహార్ వారిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా చేసి హిట్ కొట్టవచ్చనే నిర్ణయానికి వచ్చారట. ఈ మేరకు ఓ బాలీవుడ్ స్టార్ డైరక్టర్ తో మాట్లాడుతున్నట్లు వినికిడి. అయితే విజయ్ దేవరకొండ మాత్రం తనకు సౌత్ ఇండియాలో వర్కవుట్ అయ్యేలా ఇక్కడ డైరక్టర్ తో సినిమా చేద్దామని చెప్పారట. కరణ్ జోహార్ మాత్రం టచ్ లో ఉన్నాడట.