కష్టాల్లో కంగనా క్రేజీ సినిమా !      

తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రిగా వెలిగిపోయిన జయలలిత జీవితం కూడా వెండితెర పైకి రానున్న సంగతి తెలిసిందే. బాహుబలితో నేషనల్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘తలైవి’. అమ్మ బయోపిక్ అనేసరికి మొదటినుండి ఈ సినిమాలో ఎలాంటి విషయాలు ఉంటాయో.. ముఖ్యంగా జయలలితగారికి కూతురు ఉందా ? లేదా ? అలాగే శోభన్ బాబుతో ఆమె అనుబంధం గురించి, అన్నిటికీ మించి ఆమె మరణం గురించి ఇలా అనేక విషయాల పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి అమ్మ బయోపిక్ పై ఆసక్తి ఎక్కువైంది.

అయితే ఈ సినిమాకి మొదటి రోజు నుండి ఏదోక సమస్య వస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా కొత్త సమస్యలు ఎదురయ్యాయి. తాజాగా ఈ సినిమా ఎడిటింగ్ పూర్తి అయిందని.. మళ్ళీ చాలా సీన్స్ ను రీషూట్ చేయాలని దానికి ప్రధాన కారణం.. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్ కి.. ఎం.జి.ఆర్ పాత్ర‌లో నటిస్తోన్న అరవింద స్వామికి వచ్చే సీన్స్ అస్సలు బాగాలేదని తెలుస్తోంది. అయినా బోల్డ్ హీరోయిన్ కంగనా పక్కన కూల్ యాక్టర్ అరవింద స్వామి ఎలా సెట్ అవుతాడు ? ఆ మాటకొస్తే కంగనా కూడా జయలలిత పాత్రలో సరిగ్గా సెట్ అవ్వలేదు.

అసలు ఎంజీఆర్ ఆవేశం ఎక్కడా.. అరవింద స్వామిలోని సాఫ్ట్ నెస్ ఎక్కడా.. ఇప్పుడు అరవింద్ స్వామిని సినిమా నుండి తప్పించలేరు. అందుకే బాగా రాని సీన్స్ ను మళ్ళీ రీ షూట్ చేయాలని మేకర్స్ ఇప్పటికే డిసైడ్ అయ్యారట. కరోనా ప్రభావం తగ్గాక ఈ సీన్స్ తోనే షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని.. జయలలిత – ఎంజీఆర్ మధ్య ప్రేమ, సాన్నిహిత్యం అందరికీ తెలిసినా.. కంగనా – అరవింద స్వామి మధ్య కెమిస్ట్రీ మాత్రం చాల ఫ్రెష్ గా ఉంటుందట. అన్నట్టు కంగనాను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ నుండి గ్యారీ ఓల్డ్ మెన్, ‘అమ్మ’ బయోపిక్ కోసం ఇండియాకి తీసుకువచ్చారు. అయితే ఈ కరోనా సమయంలో ఆయన మళ్ళీ హాలీవుడ్ నుండి ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు. దాంతో ఇప్పుడు మేకప్ బ్యాచ్ మొత్తాన్ని కూడా మార్చాలి.