కంగనా రనౌత్ పారితోషికం తెలుసా ..?

మన హిందీ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం జరుగుతుంది . చాలా దేశాల సినిమాల కన్నా మన  సినిమాలు ఎక్కువ డబ్బు వసూలు చేస్తాయి . ఇక బాలీవుడ్  నటీనటులకు వుండే క్రెజ్ ఇంతా  అంతా కాదు . హీరోలకు లేదా  హీరోయిన్లకు స్టార్  డమ్ వస్తే చాలు వారి లైఫ్ స్టైల్ మారి పోతుంది .

హిందీ సినిమా రంగంలో ఒకప్పుడు శ్రీదేవి అత్యధిక పారోతోషికం తీసుకునేది . అయితే ఆతరువాత వచ్చిన ఐశ్వర్యా రాయ్ , ప్రియాంక చోప్రా , కరీనా కపూర్, కత్రినా కైఫ్ , దీపికా పదుకొనె , అనుష్క శర్మ లాంటి నాయికలు ఎక్కువ పారితోషికాలు తీసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి .

అయితే ఇప్పడు హిందీ సినిమా రంగంలో వున్న హీరోయిన్లలో  ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నది వీరు ఎవరూ కాదు . ఆమె కంగనా రనౌత్ . అవును నిజమే . హిందీ సినిమా రంగంలో ఇప్పుడు కంగనా రనౌత్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నది  . ప్రస్తుతము ఆమె ప్రధమ భారత సంగ్రామంలో పాల్గొన్న ఝాన్సీరాణి పాత్రను ధరిస్తున్నారు . మణికర్ణిక  పేరుతో  రూపొందే ఈ సినిమాకు క్రిష్  దర్శకుడు .  కంగనా రనౌత్  పూరి జగన్నాధ్  దర్శకత్వం వహించిన  ఏక్  నిరంజన్ అనే సినిమాలో ప్రభాస్ ప్రక్కన నటించింది .

మణికర్ణిక సినిమా కోసం కంగన  14 కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్టు తెలిసింది . ఇప్పటివరకూ ఇంత  డబ్బు ఏ నాయిక తీసుకోలేదు . దీపికా పదుకొనె  “పద్మావతి” సినిమా కోసం  11 కోట్లు తీసుకుందట . ప్రియాంక చోప్రా “భోగా ఖిరికీ” చిత్రానికి 12 కోట్లు , కరీనా తాజా సినిమా “వీరే దే వెడ్డింగ్”కు   11 కోట్లు , కత్రినా కైఫ్ “భారత్ ” సినిమాకు 9 కోట్లు  తీసుకున్నట్టు చెబుతున్నారు . ఇప్పుడు కంగన  అత్యధిక పారితోషికం తీసుకొని వార్తల్లో వుంది .