జాన్వి పక్కా ప్లానింగ్ తోనే కమిట్ అవుతుంది !

అతిలోక సుందరిగా భారతీయ సినీ ప్రపంచంలో ధృవ తారగా వెలుగులు జిమ్మిన అందాల జాబిలి శ్రీదేవి. శ్రీదేవి తెలుగు తమిళ సినిమాలతోనే సినీ ప్రపంచాన్ని ఏలింది. ఆ తరువాతే హిందీ సినిమా ఆమె జీవితంలోకి వచ్చింది. చివరికి అక్కడే సెటిల్ అయి.. బోనీ కపూర్ కి భార్యగా స్థిరపడింది. అయితే శ్రీదేవికి మొదటి నుండి సౌత్ సినిమాల పై అభిమానం ఎక్కువ. కానీ ఆమె పెద్ద కూతురు జాన్వి కపూర్ కి మాత్రం సౌత్ ఇండస్ట్రీ పై చిన్న చూపు అట. గత ఏడాదే తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన నటిస్తోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు అప్పుడు రూమర్స్ అని కొట్టి పారేసినా ఆ రూమర్స్ నిజమేనని లేటెస్ట్ గా బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న ఫైటర్ సినిమాలో మొదట జాన్వి కపూర్ ను హీరోయిన్ గా ఒప్పించాలని, ఆమెకు కథ కూడా చెప్పాడట. కానీ జాన్వి తెలుగులో చేయడానికి అంతగా ఆసక్తి చూపలేదట. పైగా పూరిని కొన్ని రోజులు పాటు వెయిట్ చేయించిందట ఈ విషయం చెప్పడానికి. దాంతో పూరి బాగానే ఉడికిపోయాడని.. అయితే జాన్వి పట్టించుకోలేదని.. చివరకు పూరి యంగ్ బ్యూటీ అనన్య పాండేను హీరోయిన్ గా తీసుకున్నారని బాలీవుడ్ మీడియా రాసిన కథనంలో సారాంశం. నిజంగానే జాన్వీ ఈ సినిమా రిజెక్ట్ చేసి మంచి నిర్ణయమే తీసుకుందట.

మొదటి సినిమానే విజయ్ దేవరకొండ పక్కన చేస్తే.. స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ లీడ్ ఛాన్స్ లు రావనేది ఒక పాయింట్. అందుకు తగ్గట్లుగానే ఎన్టీఆర్ హీరోగా రానున్న ‘అయినను పోయి రావలె హస్తినకు’.. అనే సినిమాలో హీరోయిన్ గా జాన్వికపూర్ నే తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. పైగా మెయిన్ హీరోయిన్ గా. ఎన్టీఆర్ పక్కన జాన్వికపూర్ అంటే కాంబినేషన్ కి ఓ రేంజ్ లో హైప్ వస్తోంది. ఒక్క సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో తన రేంజ్ ను అమాంతం పెంచుకోవచ్చు. మొత్తానికి జాన్వి పక్కా ప్లానింగ్ సినిమాలకు కమిట్ అవుతుంది. ఎంతైనా శ్రీదేవి కూతురు కదా.