ర‌ష్మిక ఐటీ స‌రిగా చెల్లించ‌లేదా?

ఇటీవ‌ల సెల‌బ్రిటీల‌పై వ‌రుస ఐటీ దాడులు క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. సినిమా వాళ్ల‌పై ప్ర‌త్యేకించి జీఎస్టీ అధికారుల బృందం దృష్టి సారించి దాడులు నిర్వ‌హిస్తోంది. వెంక‌టేష్‌-నాని- లావ‌ణ్య త్రిపాఠి- అన‌సూయ వంటి వారిపై ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హించారు.

తాజాగా అందాల క‌థానాయిక ర‌ష్మిక ఇంటిపైనా ఐటీ దాడులు జ‌రిగాయి. కర్ణాటక కొడగు జిల్లాలోని విరాజ్ పేటలో ఉన్న ర‌ష్మిక‌ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.  వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్న ర‌ష్మిక నెమ్మ‌దిగా పారితోషికం పెంచింద‌న్న ప్ర‌చారం సాగుతోంది.

కిరిక్ పార్టీ (క‌న్న‌డ‌), ఛ‌లో – గీత గోవింద‌-  దేవ‌దాసు- డియ‌ర్ కామ్రేడ్- స‌రిలేరు నీకెవ్వ‌రు వంటి చిత్రాల్లో న‌టించింది. న‌టించిన నాలుగైదు చిత్రాల‌కే టాప్ హీరోయిన్ గా ఎదిగేసింది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ స‌ర‌స‌న సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోంది. నితిన్ స‌ర‌స‌న న‌టించిన భీష్మ రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  ఇవే కాకుండా ఆమె చేతిలో మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.  ఆ క్ర‌మంలోనే వ‌రుస‌గా అడ్వాన్సులు పారితోషికాలు భారీగానే ముడుతున్నాయి. వీటికి స‌జావుగా ఐటీ చెల్లింపులు జ‌రిగాయా లేదా? అన్న‌ది అధికారులు ప‌రిశీలించార‌ట‌. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.