పూరి, ఛార్మి..20 కోట్లు మ్యాటర్ లో నిజం ఎంత?

గత కొద్ది కాలంగా డైరక్టర్ గా సాలిడ్ హిట్ కొట్టలేకపోతున్న దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఆయన కసిగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ టైటిల్ తో మరో ఇంట్రస్టింగ్ సినిమాని రీసెంట్ గా మొదలెట్టారు. రెగ్యులర్ సినిమా కాకుండా రూట్ మార్చి సైన్స్ ఫిక్షన్ జానర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా చేస్తున్న ఈ చిత్రం డబుల్ దిమాక్‌ అనే ట్యాగ్‌ లైన్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పూరి కంబ్యాక్‌ అవుతారన్న నమ్మకం ట్రేడ్ వర్గాల్లోనూ క్రియేట్ అయ్యింది. దాంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయయి.

ఈ నేఫధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్‌ హక్కుల్ని ఓ ప్రముఖ సంస్థ రూ.20 కోట్లకు అడిగినట్లు సమాచారం. ముందు రూ.10 కోట్లు అడ్వాన్స్‌గా, తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇస్తామని అన్నారట. అయితే దీనికి చిత్ర నిర్మాతలు పూరీ, ఛార్మి ఒప్పుకోలేదని చెబుతున్నారు. సినిమా టీజర్‌, ట్రైలర్‌ విడుదలైతే ఇంకా మంచి బిజినెస్‌ జరుగుతుందని వారు భావిస్తున్నారని టాక్ రన్ అవుతోంది. అయితే ఈ టాక్ కావాలని క్రియేట్ చేసిందా లేక నిజమా అనేది తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో నిధీ అగర్వాల్, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్, చార్మి కౌర్‌ నిర్మిస్తున్నారు. పునీత్‌ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్‌ గునాజి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు.