ప్ర‌కాష్ రాజ్ కొత్త పార్టీ పెడుతున్నారా? 

ప్ర‌జా క్షేమం పార్టీకి రంగం సిద్ధం

సూప‌ర్ స్టార్  మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనీల్ రావిపూడి ద‌ర్శ‌కుడు. అనీల్ సుంక‌ర‌, దిల్ రాజు నిర్మాత‌లు. ఈ సినిమా కోసం హైదాబాద్ ఔట్ స్క‌ర్ట్స్ లో 30 ఎక‌రాల్లో రాయ‌ల‌సీమ విలేజ్ సెట్ ని వేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య‌శాంతి స‌హా ఇత‌ర కీల‌క పాత్ర‌ధారుల‌పై చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అయితే ఈ చిత్రానికి మొద‌టి నుంచి లీకుల బెడ‌ద త‌ప్ప‌లేదు. షూటింగ్ స్పాట్ నుంచి ఏదో ఒక లీకు అందుతూనే ఉంది. మేక‌ర్స్ ఈ లీకుల‌పై ఎంత క‌ఠినంగా వ్య‌వ‌రించినా లీకులు మాత్రం అదుపులోకి రాలేదు. తాజాగా మ‌రో లీక్డ్ ఫోటో బ‌య‌ట‌కు వ‌చ్చింది.
 
ఇందులో విల‌క్ష‌ణ న‌టుడు  ప్ర‌కాశ్ రాజ్ ఓ రాజ‌కీయ నాయ‌కుడి గెట‌ప్ తో క‌నిపిస్తున్నారు. ఆయ‌న‌పై కీలక స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌కు యూనిట్ సిద్ద‌మ‌వుతోంది. ప్ర‌జాగ‌ర్జ‌న స‌భ‌కు హాజ‌ర‌య్యే ఓ స‌న్నివేశంలో ప్ర‌కాశ్ రాజ్ క‌నిపించ‌నున్నార‌ని లీక్డ్ పిక్ ని బ‌ట్టి తెలుస్తోంది. ప్ర‌జా సంక్షేమ పార్టీ ప్ర‌జా గ‌ర్జ‌న స‌భ కోసం ఓ భారీ స్టేజ్ నిర్మించారు. టెంట్లు కుర్చీలు రెడీ చేస్తున్న సెట్ వాల‌కం బ‌య‌ట‌ప‌డింది ఈ ఫోటోలో. ఆ వేదిక ముందు ప్ర‌కాశ్ రాజ్ పొలిక‌ల్ క‌టౌట్ ఏర్పాటు చేసారు. ఇదంతా చూస్తుంటే వేదిక‌పై  ప్ర‌కాష్  రాజ్  స్పీచ్ ఇచ్చే స‌న్నివేశం అయింటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. జ‌గ‌ప‌తిబాబు ఈ చిత్రంలో న‌టించాల్సింది. కానీ ఆ జాక్ పాట్ ప్ర‌కాష్ రాజ్ ని వ‌రించింది. 2020 సంక్రాంతి బ‌రిలో ఈ చిత్రం రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.