ఎస్వీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు మెగాస్టార్ హ్యాండిచ్చారా?

ఎట్టకేల‌కు సై అన్నారు సైరా స్టార్

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఎస్వీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌ర‌గ‌నుంద‌ని ఇంత‌కుముందు ప్ర‌క‌టించారు. తాడేప‌ల్లిలో అభిమాన సంఘాల ప్ర‌తినిధులు అందుకు ఏర్పాట్లు చేశారు. అయితే చివ‌రి నిమిషంలో ఏమైందో లాంచింగ్ క్యాన్సిల్ అంటూ మ‌రో షాకింగ్ న్యూస్ తెలిసింది. అస‌లేమైంది? అంటే అప్ప‌ట్లో మెగాస్టార్ `సైరా` టెన్ష‌న్స్ లో ఉండ‌డంతో మ‌ధ్య‌లో ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేయాల్సి వ‌చ్చింద‌ట‌.
 
ఎట్ట‌కేల‌కు మెగాస్టార్ న‌టించిన‌ సైరా రిలీజై విజ‌యం అందుకుంది. ఇక అన్ని టెన్స‌న్స్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌డంతో మ‌రోసారి విగ్ర‌హావిష్క‌ర‌ణకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. విశ్వ న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని.. ప‌ద్మ‌భూష‌ణుడు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌నున్నారని తాజాగా వార్త అందింది. 6 అక్టోబ‌ర్ 2019 (ఆదివారం) ఉద‌యం 10.15 నిమిషాల‌కు తాడేప‌ల్లిగూడెం య‌స్.వి.ఆర్.స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఏర్పాట్లు సాగుతున్నాయి. `సైరా:న‌ర‌సింహారెడ్డి` ఘ‌న‌విజ‌యం నేప‌థ్యంలో ప్ర‌చారకార్య‌క్ర‌మాల బిజీలోనూ మెగాస్టార్ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబడి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు విచ్చేస్తున్నందుకు నిర్వాహ‌కులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎస్వీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ క‌ర్త‌లు మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి `సైరా: న‌ర‌సింహారెడ్డి` చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న ఆనందంలో ఉన్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగా మెగాస్టార్ అద్భుతంగా న‌టించారు. ఐదు భాష‌ల్లో రిలీజైన సైరా విజ‌యం తెలుగు వారి స‌క్సెస్ గా భావిస్తున్నాం. ఒక గొప్ప చారిత్ర‌క విజ‌యం అందుకున్న‌ సంద‌ర్భంగా ఎస్వీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఆయ‌న విచ్చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట కోసం క‌మిట్‌మెంట్‌తో మెగాస్టార్ ఈ ఆవిష్క‌ర‌ణ‌కు విచ్చేస్తున్నారు. ఓవైపు సైరా ప్ర‌చారంలో బిజీగా ఉండీ ఆయ‌న మాట‌కు క‌ట్టుబ‌డి విచ్చేయ‌డం సంతోషాన్నిస్తోంది. ఆదివారం ఉద‌యం గ‌న్న‌వ‌రం నుంచి తాడేప‌ల్లి చేరుకుని విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు. అటుపై తిరిగి మెగాస్టార్ హైద‌రాబాద్ కి విచ్చేస్తారు“ అని తెలిపారు.