హీరో రామ్‌కు పోలీస్ లు ఫైన్, పబ్లిసిటీ ట్రిక్!?

హీరో రామ్‌, డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. జులై 18న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌‌లో సినిమా చివరి షూటింగ్ దశకు చేరుకుంది. మరో రెండ్రోజుల్లో గుమ్మిడికాయ కొట్టేయనున్నారు . ఈ తరుణంలో హీరో రామ్‌కు హైదరాబాద్ పోలీసులు జరిమానా విధించినట్లు వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి.

బహిరంగంగా ధూమపానం హైదరాబాద్‌ పోలీసులు రూ. 200 జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బహిరంగ ధూమపానానికి హీరో రామ్‌కు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. కాగా సినిమా షూటింగ్ అనంతరం చార్మినార్ వద్ద రామ్ స్మోక్ చేస్తుండగా చార్మినార్ ఎస్సై గమనించి జరిమానా విధించారు వార్తలు వచ్చాయి.

అయితే ఇది పబ్లిసిటీ కోసం చేసిన ట్రిక్ అంటూ కొంత మంది సినిమావాళ్లు కొట్టిపారేస్తున్నారు. సినిమాకు అనుకున్నంత బజ్ క్రియేట్ కాకపోవటంతో ఈ చిత్రం టీమ్, పీఆర్ తో కలిసి సినిమా గురించి మాట్లాడుకునేలా చేయటానికి చేసిన ప్రయత్నం ఇది అని చెప్పుకుంటున్నారు.

ఇంతకు ముందు సైతం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కథ కాపీ అని.. ఆ తర్వాత కథ మొత్తం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరో అచ్చుగుద్దినట్లుగా దింపేశారని ఇలా పలు విషయాల్లో చర్చనీయాంశమైంది.

రామ్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్లు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయ్యింది. పాటల చిత్రీకరణ జరుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.