బన్ని,త్రివిక్రమ్ కొత్త సినిమాపై చెత్త రూమర్స్

అదిగో పులి..అంటే ఇదిగో తోక అనే విధంగా  మీడియా తయారైంది. ఓ సినిమా ప్రకటన రావటం ఆలస్యం…ఇదే కథ అంటూ తమకు తోచింది అల్లేసి ప్రచారంలోకి తెచ్చేస్తున్నారు. కొత్త సంవత్సరం కానుకగా..అల్లు అర్జున్ తన కొత్త చిత్రం ప్రకటించి ఇంకా ఓ రోజు కూడా కాలేదు. అప్పుడే… ఆ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ కథనాలు పెద్ద పెద్ద మీడియా సంస్దలు సైతం ప్రకటించేస్తున్నాయి.

బన్నీతో త్రివిక్రమ్ రూపొందించనున్న సినిమా కథాంశం కథ తండ్రీ కొడుకుల అనుబంధానికి సంబంధించినదిగా ఉంటుందనేది తాజా రూమర్. గతంలో త్రివిక్రమ్ .. బన్నీ కాంబినేషన్లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఒక రకంగా తండ్రీ కొడుకులకి సంబంధించినదే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టోరీ లైన్ వంటకం వండేసారన్నమాట. అయితే ఈ సారి త్రివిక్రమ్ సిద్ధం చేసిన కథ కొత్త కోణంలో ఉంటుందని కోటింగ్ పూస్తున్నారు.

త్రివిక్రమ్ ఈసారి కూడా తన కథలో యాక్షన్ .. కామెడీతో పాటు ఎమోషన్ కి ప్రాధాన్యతను ఇవ్వచ్చేమో కానీ అదే స్టోరీ లైన్ ఎందుకు చేస్తాడనేది సగటు ప్రేక్షకుడుకు అర్దమయ్యే విషయం. గీత ఆర్ట్స్ .. హారిక అండ్ హాసిని ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించి.. జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ను చిత్రయూనిట్‌ ప్రారంభించనుంది.

‘నా పేరు సూర్య’ఫ్లాఫ్ తరువాత అల్లు అర్జున్‌ ఆచితూచి కథలను ఎంపిక చేస్తున్నాడు. అందుకే ఆ మూవీ తరువాతే మరే ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించలేదు. విక్రమ్‌ కె కుమార్‌ డైరెక్షన్‌లో ఓ మూవీ చేయనున్నాడని, తమిళ హిట్‌ మూవీ 96రీమేక్‌లో నటించనున్నాడని, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తదుపరి ప్రాజెక్ట్‌ ఉండనుందని వార్తలు వినిపించాయి. అయితే ఫైనల్‌గా మాటల మాంత్రికుడు చెప్పిన కథకే ఓకే చెప్పాడు.