వడ్డీతో సహా తీరుస్తానంటూ ప్రామిస్..ఏంటా ధైర్యం?

వ‌ర‌స‌గా రెండు ఫ్లాపుల త‌ర్వాత రామ్ “హ‌లో గురు ప్రేమ‌కోస‌మే” అంటూ వచ్చాడు. దిల్ రాజు బ్యానర్, వరస హిట్స్ ఇస్తున్న త్రినాథ‌రావ్ న‌క్కిన డైరక్షన్. ఎన్నో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నాడు. అయితే చిత్రం విడుద‌లైంది. తన దారి తాను చూసుకుంది. రామ్ కు మళ్లీ నిరాశే మిగిల్చింది. ఓపినింగ్స్ ఓ రేంజిలో వచ్చినా వారం తిరక్కుండానే కలెక్షన్స్ పూర్తి గా డ్రాప్ అయ్యాయి.

బ్రేక్ ఈవెన్ రావటం కూడా చాలా కష్టమైపోయింది. దాంతో రూపాయి ఎవరికీ మిగలలేదు. పెట్టిన డబ్బుతిరిగి వస్తే చాలాని దణ్ణాలు పెట్టుకున్నారు డిస్ట్రిబ్యూటర్స్. రామ్ సినిమా అంటే భయం పట్టుకునే పరిస్దితి మళ్లీ మొదలైంది. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు రామ్. ఆ మాటే ట్విట్టర్ వేదికగా జనాలకు చెప్పేసాడు.

“హలో గురు ప్రేమ కోసమే నన్ను పూర్తిగా తృప్తిపరచలేదు. కానీ నేను వడ్డీ తో సహా తీరుస్తానని ప్రామిస్ చేస్తున్నా ,” అంటూ ట్వీట్ చేసి తన తదుపరి ప్రాజెక్టుపై తన నమ్మకాన్ని వ్యక్తం చేసారు. అయితే రామ్ నెక్ట్స్ చేయబోయేది పూరి జగన్నాథ్ తో. ఆయన వరస ప్లాఫ్ ల్లో ఉన్నాడు. ఇద్దరు కలిసి హిట్ కొట్టాలి. అప్పుడే వడ్డీతో తీరుస్తాడో..అసలు తీరుస్తాడో తేలుతుంది.

ప్రస్తుతానికి పూరి ఓకథను రామ్ కు చెప్పి ఓకే చేయించుకన్నారట. ఆ కథ విన్న ఉత్సాహంలోనే ఈ ట్వీట్స్ వేస్తున్నాడంటున్నారు.రామ్ ఇంత ఉత్సాహంగా తనపై నమ్మకం పెట్టుకోవటం చూసిన పూరి పొంగిపోయి..ఆ కథను పూర్తిగా డెవలప్ చేసేందుకు,డైలాగ్స్ రాసేందుకు బ్యాంకాక్ వెళ్లిపోయారట. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.