‘మెడ్రాస్’, ‘కాలా’, ‘కబాలి’ చిత్రాలతో స్టార్ డైరక్టర్ గా ఎదిగారు పా. రంజిత్. అయితే ఆయన కేవలం దర్శకుడుగానే కొనసాగకుండా ఈ మధ్యకాలంలో నిర్మాతగా మారి రూపొందించిన తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాల్’. తన సన్నిహితుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలోని ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
అంటరానితనం, వర్గాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా రంజిత్ స్టైల్ ని మరోసారి చూపించింది. దాంతో ఈ నేపథ్యంలో రెండో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు రంజిత్.
తన నీలం ప్రొడక్షన్స్ బ్యానరుపై రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఇరండాం ఉలగ పోరిన్ కడైసి గుండు’ అని పేరు పెట్టారు. అదియన్ ఆదిరై దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. రంజిత్ వద్ద మెడ్రాస్, కబాలి, కాలా చిత్రాలకు అశోశియోట్ డైరక్టర్ గా పనిచేసిన వ్యక్తే అదియన్. అదియన్ చెప్పిన కథ నచ్చటంతో వెంటనే సినిమా ప్రారంభించటానికి సన్నాహాలు మొలెట్టారు.
ఇందులో అట్టకత్తి ధినేష్ హీరోగా నటిస్తున్నారు. అనేక, రిత్వికలు హీరోయిన్స్. లిజీష్, మునీష్కాంత్, రమేష్ తిలక్లు ఇతర తారాగణం. తెన్మా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కళా దర్శకుడిగా రామలింగం వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్లుక్ను తాజాగా విడుదల చేశారు. కథకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.