రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వినయ విధేయ రామ’.ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ని సోమవారం విడుదల చేశారు. ‘తందానే తందానే.. చూశారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే.. తందానే తందానే.. కన్నారా ఎవరైనా ప్రతి రోజు పండగనే..’ అని సాగే ఈ పాట సాగింది. ‘బంధాల గ్రంథాలయమే ఉందీ ఇంట్లోనే..’ అంటూ కుటుంబ విలువలు, మమకారాల్ని ఈ పాటలో వర్ణించారు. ఎమ్.ఎల్.ఆర్ కార్తికేయన్ ఈ పాటను పాడారు.
ఇక ఈ పాట దేవిశ్రీప్రసాద్ పరమ రొటీన్ ట్యూన్ అని అంటున్నారు. కొత్తదనం ఏ కోశానాలేదని, బోయపాటి ఎలా ఓకే చేసాడో అర్దం కావటం లేదని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో అది కలిసిపోయి..సిట్యువేషన్ సాంగ్ గా రావచ్చు కానీ..విడిగా పాటగా బాగా డల్ గా ఉందని అంటున్నారు. మరీ ఫ్యామిలీ సాంగ్ అంటే ఇంతలా ఉండాలా అని మరికొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ సినిమాలో పాటలు అంటే ఏ స్దాయిలో ఉండాలి..బోయపాటి ఆ విషయం మీద కాన్సర్టేట్ చేయాలి అంటున్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. కియారా అడ్వాణీ హీరోయిన్. వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులోని స్పెషల్ సాంగ్ లో ఇలియానా నటించనున్నట్లు సమాచారం. ‘నువ్వు పందెం పరుశురాం అయితే ఏంటి.. ఇక్కడ రామ్.. కొ-ణి-దె-ల’ అంటూ ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్కు మంచి స్పందన లభించింది.