రంగమ్మత్త  రచ్చ…ఇంకా చేస్తూనే ఉంది

రీసెంట్ గా జబర్దస్త్ పోగ్రాంకు సక్సెస్ ఫుల్ టీవీ యాంకర్,  నటి అనసూయ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా కనిపించి అదరకొట్టింది. రామ్ చరణ్ హీరోగా చేసిన ఆ చిత్రంలో రంగమ్మత్తగా అనసూయ మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ బాగా ఆకట్టుకుంది. దాంతో ఆమెనే ప్రధాన పాత్రలో పెట్టి సినిమా చేస్తే క్రేజ్ వస్తుందని దర్శక,నిర్మాతలు భావించినట్లున్నారు.


 
అనసూయ ప్రధాన పాత్రలో ఓ చిత్రం రెడీ చేసి ఫస్ట్ లుక్ వదిలేసారు. అయితే అందరూ రంగమ్మత్త ఫస్ట్ లుక్ అంటున్నారు కానీ అనసూయ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ అనటం లేదు..రంగమ్మత్త అంతలా జనంలోకి వెళ్లిపోయింది.

అనసూయ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కథనం’. దసరా  సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమే కీ క్యారక్టర్ …అందుకే ఆమెనే ఫస్ట్ లుక్ పోస్టర్ పై ముద్రించి వదిలారు.

ఇక ఈ చిత్రాన్ని గాయత్రి ఫిల్మ్స్ ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దర్శకుడు రాజేష్ నాదెండ్ల తెరకెక్కిస్తున్నారు. నటుడు అవసరాల శ్రీనివాస్,
ధన్‌రాజ్ పధాన ప్రాతల్లో నటిస్తున్నారు. బట్టెపాటి నరేంద్ర‌రెడ్డి, శర్మ చుక్కు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.