ఇండస్ట్రీ టాక్ : ప్రభాస్ తర్వాత సినిమాకి నిర్మాతలు దొరికేసారా? ఎవరంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఓకే చేసినటువంటి చిత్రాల్లో దర్శకుడు మారుతితో ఓ భారీ సినిమాని కూడా చేయనున్నట్టు తెలిసిందే. అయితే ఈ సినిమా ఈరోజే ముహూర్తం కూడా కుదుర్చుకోగా ఈ సినిమాకి ఆల్రెడీ భారీ సెట్టింగ్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి.

అయితే ఈ సినిమా విషయంలో గత కొంత కాలం నుంచి కూడా ఈ సినిమా విషయంలో ఏదొక రచ్చ అలా నడుస్తూనే ఉంది. కానీ ఫైనల్ గా అయితే సినిమా మాత్రం ఆగలేదు అని మాత్రం ఒక క్లారిటి వచ్చింది. అయితే ఈ సినిమా విషయంలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తప్పుకున్నారని వార్త మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ మరింత స్థాయిలో కంగారు పెట్టింది.

అయినా కూడా సినిమా ఆగలేదు అంటే వేరే ప్రొడక్షన్ వారు ఈ సినిమాని టేకప్ చేసారని సినీ వర్గాల్లో టాక్ బయటకి వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మాణం వహించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ముందుకొచ్చారట.

వీరు ఇక మీద నుంచి ఈ సినిమా నిర్మాణ భాద్యతలు తీసుకున్నారని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. అయితే వీరు ఎంత మేర బడ్జెట్ ని పెడతారో చూడాలి. అలాగే ఈ నిర్మాణ సంస్థ నుంచి లేటెస్ట్ గా వచ్చిన సినిమానే “కార్తికేయ 2”. ఇది పెద్ద బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఇక మరో విషయం ఏమిటంటే ఈ సినిమా అక్టోబర్ లో చివరి వారంలో షూటింగ్ మొదలు కానుందట.