సినిమా రంగం నుంచి సుహాసినికి మద్దతు

తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం లో మహాకూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న సుహాసిని కి సినిమా రంగం నుంచి మద్దతు పెరిగే అవకాశం కనిపిస్తుంది . ఇప్పటికే ఆమె సోదరులు కళ్యాణ్ రామ్ , జూనియర్ ఎన్టీఆర్ ఆమెను భారీ మెజార్టీతో గెలిపించామని విజ్ఞప్తి చేశారు .

బాల కృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ కు  సన్నిహితుడైన  జగపతి బాబు కూడా సుహాసిని గెలుపు కోసం విజ్ఞప్తి చేశాడు . “కూకట్ పల్లి  నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న శ్రీమతి నందమూరి సుహాసిని కి నా సంపూర్ణ మద్దతు తెలియ జేస్తున్నా . శ్రీమతి సుహాసిని పరిపూర్ణ వ్యక్తిత్వం గల నాయకురాలు , నీతి , నిజాయితితో ప్రజా సేవ చేయగలరనే నమ్మకం నాకుంది ” అని చెప్పారు .

ఈ నెల 26 నుంచి బాలకృష్ణ ప్రచారం చేయబోతున్నట్టు తెలిసింది . ముఖ్యంగా కూకట్ పల్లి తో బాటు ఆయన నిర్మాత ఆనంద్ ప్రసాద్ పోటీ చేస్తున్న శేరిలింగం పల్లి నియోజక వర్గ పై కూడా బాలయ్య ఎక్కువ ద్రుష్టి పెట్టె అవకాశం వుంది .

తెలుగుదేశం కోసం  మురళి మోహన్, శ్రీమతి జయ సుధ కూడా ప్రచారం చేస్తారని చెబుతున్నారు .

చివరి నిముషంలో బాలయ్య  చెప్పేదాన్ని బట్టి కళ్యాణ్ రామ్ , జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారం చెయ్యవచ్చునని అంటున్నారు .