గౌర‌వం కాపాడ‌మ‌ని రెబ‌ల్ స్టార్ ఆవేద‌న‌

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) నిర్వాకం గురించి తెలిసిందే. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో టాలీవుడ్ ప‌రువు తీయడంలో పోటీప‌డుతున్నారు. ప‌ద‌వుల పందేరంతో రియ‌ల్ పాలిటిక్స్ ఇక్క‌డ డీసెన్సీని నాశ‌నం చేసింది. దీనిపై సినీపెద్ద‌లంతా ఒక‌టే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. హుందాగా ఉండాల్సిన చోట చెత్త‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ చీవాట్లు తినాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వుతోంది.

నేడు మా డైరీ 2020 ఆవిష్క‌ర‌ణ‌లో మా ఉపాధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్ ఎమోష‌న‌ల్ అవ్వ‌డం న‌రేష్ పై ఆరోపించ‌డం.. అణ‌చి వేస్తున్నార‌ని అన‌డం వేడెక్కించింది. మీడియా లైవ్ లో ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పార‌ని సినీపెద్ద‌లు చిరంజీవి స‌హా మోహ‌న్ బాబు- కృష్ణం రాజు సీరియ‌స్ అయ్యారు. కావాల‌నే ఇలా లైవ్ లో గొడ‌వ చేశార‌ని రాజ‌శేఖ‌ర్ పై చిరు సీరియ‌స్ అయ్యారు. 

ఇక ఇదే వేదిక‌పై రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ .. టాలీవుడ్ గౌర‌వాన్ని అంత‌ర్జాతీయ వేదిక‌పై పెంచాల‌ని కోరారు. ఉన్న గౌర‌వాన్ని కాపాడితే చాలు ఇంకా పెంచాల్సిన ప‌నే లేద‌ని అన్నారు. మీరు పెంచాల్సిన ప‌ని లేదు. ఉన్న‌ది కాపాడితే చాలు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బాహుబ‌లి, సాహో, సైరా లాంటి చిత్రాల‌తో మ‌న గౌర‌వం పెరిగింద‌ని బాలీవుడ్ ఇప్ప‌టికే టాలీవుడ్ అంటే ఒణుకుతోంద‌ని అన్నారు. హాలీవుడ్ సైతం ఇటువైపు చూస్తోంద‌ని అన్నారు. రెబ‌ల్ స్టార్ సూచ‌న పాటించి క‌నీసం గౌర‌వం కాపాడితే చాలు. ఆ ప‌ని మా ప్ర‌బుద్ధులు చేస్తారంటారా?
 
Krishnam Raju pleaded the MAA to upheld Tollywood’s respect. Krishnam Raju made this plea after the ruckus that took place during the MAA 2020 dairy launch.