సెప్టెంబర్ 12న  `ఎందుకో ఏమో` విడుదల 

మ‌హేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై నందు,నోయ‌ల్, పున‌ర్న‌వి హీరో హీరోయిన్లుగా కోటి వ‌ద్దినేని ద‌ర్శ‌కత్వంలో మాల‌తి వ‌ద్దినేని నిర్మిస్తోన్న చిత్రం `ఎందుకో ఏమో`. ఇటీవల ఈ చిత్రం టీజర్, సాంగ్స్ విడుదలై సినిమా పై మంచి క్రేజ్ ని ఏర్పరిచాయి. అన్ని కార్యాక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న వినాయక చవితి కానుకగా విడుదలవుతుంది. ఈ సందర్భం గా దర్శకుడు  కోటి వ‌ద్దినేని మాట్లాడుతూ…“ ఎందుకో ఎమో` సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నా. నందు, నోయ‌ల్, పున‌ర్న‌వి హీరో హీరోయిన్లుగా న‌టించారు. ఇదొక ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరి. కథ, కథనాలు కొత్తగా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సెప్టెంబర్ 12 న గ్రాండ్ గా సినిమా రిలీజ్ అవుతుంది“ అన్నారు. 

 

నిర్మాత మాల‌తి వ‌ద్దినేని మాట్లాడుతూ…“ మ‌హేశ్వ‌ర క్ర్రియేష‌న్స్ ప‌తాకంపై ఇది మా తొలి సినిమా. వినాయ‌క్ గారి చేతుల మీదుగా   విడుదలైన టీజర్ కు, బోయపాటి శ్రీను గారి చేతుల మీదుగా రిలీజ్ అయినా పాటలకు మంచి  రెస్పాన్స్ వస్తోంది.  మ్యాంగో  ఆడియో ద్వారా పాటలు మార్కెట్ లోకి విడుదలయ్యాయి. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమాను ఏ విష‌యంలో రాజీ ప‌డ‌కుండా నిర్మించాం.  మంచి ల‌వ్ స్టోరీ తో పాటు క‌మ‌ర్షియ‌ల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా అవుతుంది. మా యూనిట్ అంతా పూర్తి సహాయ స‌హ‌కారాలు అందించ‌డంతో సినిమాను అనుకున్న‌విధంగా పూర్తి చేయ‌గ‌లిగాం. సెన్సార్ కంప్లీట్ అయ్యింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 12న విడుదల  చేస్తున్నాం“ అన్నారు. 

నందు, నోయ‌ల్, పునర్న‌వి, పోసాని, సూర్య‌, సుడిగాలి సుధీర్, న‌వీన్‌, రాకెట్ రాఘ‌వ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతంఃప్ర‌వీణ్‌;  కెమెరాఃజియ‌స్ రాజ్‌; ఎడిటింగ్ః మ‌ధు; ఆర్ట్ః వ‌ర్మ‌;  ఫైట్స్ః డ్రాగ‌న్ ప్ర‌కాష్‌;   నిర్మాతః మాల‌తి వ‌ద్దినేని; క‌థ‌-స్ర్కీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంఃకోటి వ‌ద్దినేని.