డైరక్టర్ బాలా కు మైండ్ దొబ్బిందా?

‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కొత్త పోస్టర్…ప్లాఫ్ అని ఫిక్సై పోతున్నారు. తమిళ దర్శకుడు బాలా కు ఏమన్నా మైండ్ దొబ్బిందా అని తిట్టిపోస్తున్నారు. తెలుగులో బ్లాక్ బ‌స్టర్ హిట్‌గా నిలిచిన అర్జున్ రెడ్డి చిత్రం ప్ర‌స్తుతం త‌మిళం, హిందీ భాష‌ల‌లో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

ప్రముఖ దర్శకుడు బాలా ..త‌మిళంలో వ‌ర్మ అనే టైటిల్‌తో తెర‌కెక్కుస్తారు.చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వర్మ టైటిల్ తో చిత్రం రూపొందుతుంది. బోల్డ్ కంటెంట్ తో సహజత్వ ప్రేమకథగా తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని ఇంకెంత అద్బుతంగా రూపొందిస్తాడో బాలా అని ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పటిదాకా రిలీజైన పోస్టర్, టీజర్ చూస్తూంటే ఆ నమ్మకాలు పోతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంభందించి మరో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు. రిలీజ్ డేట్ తో ఉన్న ఆ పోస్టర్ ని చూడగానే సినిమాపై పూర్తి నమ్మకాలు పోయాయంటున్నారు అర్జున్ రెడ్డి అభిమానులు. అయితే సినిమాలో కంటెంట్ చూడకుండా కేవలం పోస్టర్, టీజర్ చూసి అంచనావేయటం అనేది ఎంతవరకూ పద్దతి అంటూ బాలా అభిమానులు రిప్లై ఇస్తున్నారు.

నేషనల్ అవార్డు విన్నర్ రాజు మురుగున్ చిత్రానికి డైలాగ్స్ అందించాడు. తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రం భారీ విజయం సాధించడంతో తమిళంలోను ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. హీరోయిన్ గా బెంగాలీ భామ మేఘా చౌద‌రి న‌టిస్తుంది. ఈ చిత్రంలో ఈశ్వరీరావు ముఖ్య పాత్ర‌లో నటిస్తుంది.

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. వ‌చ్చే ఏడాది ఫిబ్రవ‌రిలో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్న‌ట్టు మేక‌ర్స్ పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. ఈ4 ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఒరిజినల్ వర్షన్ కు సంగీతం అందించిన రధాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీలో క‌బీర్ సింగ్ అనే టైటిల్‌తో రూపొందుతుంది.