ప్రభాస్ 21 కోసం 15కోట్లు డిమాండ్ చేస్తోంద‌ట‌

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జాన్ (ప్ర‌భాస్ 20) చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉండ‌గా.. త‌దుప‌రి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో భారీ పాన్ ఇండియా చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌హ‌మ్మారీ నిర్భంధం వ‌ల్ల షూటింగులు వాయిదా ప‌డ్డాయి. అయితే నాగ్ అశ్విన్ మాత్రం చ‌క‌చ‌కా ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నుల్ని పూర్తి చేస్తున్నార‌ట‌. ఆ క్ర‌మంలోనే ప్ర‌భాస్ 21 కోసం క‌థానాయిక‌ను వెతికే ప‌నిలో ఉన్నాడ‌ని తెలిసింది.

ప్ర‌భాస్ 21 పూర్తిగా సోషియో ఫాంట‌సీ సినిమా. ఫిక్ష‌న్ బ్యాక్ డ్రాప్ అదిరిపోతుంద‌ని స‌మాచారం. ఇది కూడా పాన్ ఇండియా కేట‌గిరీ కాబ‌ట్టి హిందీ మార్కెట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ క్ర‌మంలోనే బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక ప‌దుకొనేను ఎంపిక చేశార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. అయితే దీపిక‌ను సంప్ర‌దించిన మాట నిజ‌మే కానీ.. త‌ను ఎంత డిమాండ్ చేసిందో తెలుసా? ఏకంగా 15 కోట్లు డిమాండ్ చేసింద‌ని తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో దీపిక రేంజ్ అంత‌కంత‌కు పెరుగుతోంది. పద్మావ‌త్ 3డి త‌ర్వాత త‌న రేంజ్ స్కైని ట‌చ్ చేసింది. దీపిక పాన్ ఇండియా స్టార్ గా భారీ ప్రజాదరణ పొందింది. అందుకే ఒక్కో చిత్రం కోసం దాదాపు 15 కోట్లు డిమాండ్ చేస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకులతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తరువాత, ఆమె ఇటీవల ఛపాక్ లాంటి ఫ్లాప్ సినిమాలో న‌టించినా.. పారితోషికంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ప్రభాస్ 21 కోసం తాము ఏ అంశంలోనూ రాజీ పడటం లేదని నిర్మాత అశ్విని దత్ అన్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ దీపిక గొప్ప ఆప్ష‌న్ అని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. ఆ క్ర‌మంలోనే అంత పెద్ద మొత్తం ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే సినిమా మొద‌లైంది. మ‌హ‌మ్మారీ త‌గ్గితే సెట్స్ కెళ్లేందుకు నాగ్ అశ్విన్ బృందం రంగం సిద్ధం చేస్తోంది.