ఆస్తి కోసం దాస‌రి కొడుకుల సిగ‌ప‌ట్లు

త‌మ్ముడు వ‌ల్ల ప్రాణ‌హాని ఉంద‌న్న దాస‌రి పెద్ద‌ కొడుకు

దివంగ‌త ద‌ర్శ‌కదిగ్గ‌జం డాక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు ఇంట ఏం జరుగుతోంది? ఆయ‌న సుపుత్రుల మ‌ధ్య ఆస్తి వివాదం ఓ కొలిక్కి రాలేదా? అంటే అవున‌నే తాజా గొడ‌వ‌లు చెబుతున్నాయి. ఆస్తిలో వాటాల కోసం అన్న‌ద‌మ్ములు ప్ర‌భు- అరుణ్ కుమార్ మ‌ధ్య గొడ‌వ‌లు నిరంత‌రం జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా పెద్ద కుమారుడు ప్ర‌భు త‌న‌కు త‌మ్ముడి వ‌ల్ల ప్రాణ‌హాని ఉంద‌ని ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైంది.

దాసరి చిన్న కొడుకు అర్థ రాత్రి సమయంలో నా ఇంటికి గోడ దూకి వచ్చాడని.. ఇంట్లో బీరువా గ‌దిలోకి వెళ్లి ప‌త్రాలు త‌నిఖీ చేస్తున్నాడ‌ని అన్న దాసరి ప్రభు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంలో త‌మ్ముడిపై దాసరి ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువా తలుపులు బలవంతంగా తెరిచేందుకు యత్నించిన అరుణ్ కుమార్ ఆస్తి కోస‌మే ఇలా చేస్తున్నార‌ని ఫిర్యాదులో ప్రభు పేర్కొన్నారు. దీనికి సంబంధించి సీసీటీవీ పుటేజ్ కూడా ఉందని అరుణ్ కుమార్ పోలీసుల‌కు వెల్ల‌డించారు.

అంతేకాదు.. ఇప్పటి వరకూ చాలామంది సినీ ప్రముఖుల వద్దకు వెళ్లి తమ పరిస్థితి చెప్పామని కానీ ఎవ్వరూ తమకు పరిష్కారం చూపేందుకు ముందుకు రాలేదని ప్రభు వాపోయారు. మోహ‌న్ బాబు- ముర‌ళీ మోహ‌న్ – సి.క‌ల్యాణ్ వంటి వారు ఈ స‌మ‌స్య విష‌య‌మై ముందుకొచ్చి ప‌రిష్కారం చూపాల‌ని దాస‌రి ప్ర‌భు కోరారు. అంతేకాదు.. నా తమ్ముడు అరుణ్ కుమార్ నుంచి నాకు ప్రాణహాని ఉందని ప్రభు ఆరోపించారు.

తాజా ఉదంతంతో పెద్దాయ‌న ప‌రువు తీసేందుకు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారంటూ అన్న‌ద‌మ్ముల‌పై ఇండ‌స్ట్రీలో చ‌ర్చ సాగుతోంది. పండిత పుత్ర ప‌ర‌మ షుంట.. అన్న చందంగా దాస‌రి ప‌రువు తీయ‌డం అన్న‌ద‌మ్ముల‌కు త‌గ‌ద‌ని అభిమానులు వాపోతున్నారు. మాన‌వ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేన‌ని దాస‌రి వార‌సుల విష‌యంలో మ‌రోసారి ప్రూవైంద‌ని ప‌రిశ్ర‌మ‌లో వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు దాస‌రి పెద్ద కుమారుడు ప్ర‌భు త‌న మొద‌టి భార్య‌తో ఆస్తి వ్య‌వ‌హారంలో ఘ‌ర్ష‌ణ ప‌డిన సంగ‌తి తెలిసిందే. దాస‌రి ఇంట వ‌రుస కోర్టు వివాదాలు ఆయ‌న బ‌తికి ఉన్న‌ప్పుడే మొద‌లై ప‌రాక‌ష్ట‌కు చేరుకున్నాయి. ఆయ‌న ఆ బెంగ‌తోనే చ‌నిపోయారు! అనే అభిమానులు కూడా ఉన్నారు.