కెఎస్ రామారావు విజయ్ దేవరకొండ చిత్రం ప్రారంభం

విజయ్ దేవరకొండ , రాశీ ఖన్నా ,ఐశ్వర్య రాజేష్ తో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కెఎస్ రామారావు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ హైద్రాబాద్లో మొదలయ్యింది. విజయ దశమి పండుగ రోజున కేఎస్ రామా రావు 46వ వినిమా షూటింగ్ ఆత్మీయుల  మధ్య ప్రారంభమయ్యింది . దేవుడి పటాలపై తీసిన తొలి సన్నివేశానికి   టి. సుబ్బరామిరెడ్డి క్లాప్ ఇచ్చారు

 కెఎస్ రామారావు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన నిర్మాత. .అయితే గత కొంత కాలంగా ఆయన తీసిన సినిమాలు విజయవంతం కాలేదు . క్రియేటివ్ కమర్షియల్  పతాకంపై ఆయన కుమారుడు వల్లభ నిర్మాతగా తానూ సమర్పకుడిగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఈ సందర్భగా రామారావు మాట్లాడుతూ .. “మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు ” సినిమా దర్శకుడు క్రాంతి మాధవ్ చెప్పిన కథ చాలా ఇన్స్పిరింగ్ గా అనిపించింది . ఈ సారి తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం కలిగింది అన్నారు.

సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ . విజయ దశమి రోజున విజయ్ దేవరకొండ తో రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా  అన్నాడు. విజయ్ మాట్లాడుతూ , నేను పుట్టాక ముందు నుంచి వున్న బేనర్ క్రియేటివ్ కమర్షియల్ , ఈ  సంస్థ లో నాకు అవకాశం ఇచ్చినందుకు రామారావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు.