ఇన్ సైడ్ టాక్: కెమెరా మెన్ దెబ్బకొట్టబట్టే రామ్ చరణ్ డీలా

                                                               (సూర్యం)

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన `రంగ‌స్థ‌లం` సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ సక్సెస్ ని  అందుకున్నాడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. ఆ సినిమాతో కేవలం
క‌మ‌ర్షియ‌ల్‌గా భారీ విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాకుండా న‌టుడిగా కూడా ప్ర‌శంస‌లు ద‌క్కించుకుని టాప్ స్లాట్ లోకి వెళ్లిపోయాడు. ఈ ఊపులో మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతూ బోయపాటి శ్రీను సినిమా ప్రారంబించాడు.

`విన‌య విధేయ రామ‌` అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం  సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని చిత్ర‌యూనిట్ భావిస్తోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా బ‌య‌ట‌కు రాకపోవటం అబిమానులను కంగారుపెడుతోంది.

టైటిల్, ఫ‌స్ట్‌లుక్, టీజ‌ర్‌.. ఏదీ విడుద‌ల కాకపోవటంతో…. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ సినిమా గురించిన అదిరిపోయే అప్డేట్ బ‌య‌ట‌కు అంతా భావించారు. ఎదురుచూసిన అభిమానుల‌కు నిరాశే ఎదురైంది. మ‌రోవైపు ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా భాగం పెండింగ్ ఉంద‌ని, సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రావడం క‌ష్ట‌మేన‌ని వార్త‌లు విన‌బ‌డుతున్నాయి.  ఈ నేఫద్యంలో అసలేం జరుగుతోంది. ఎందుకిలా లేటు అవుతోందనే విషయం అందరిలోనూ చర్చనీయాంసంగా మారింది.

అసలేం జరిగింది

అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమాకు కెమెరామెన్ దెబ్బకొట్టాడని వినికిడి. కెమెరామెన్ రిషి పంజాబి అక్టోర్ చివరి వరకూ డేట్స్ ఇచ్చారు. అయితే బోయపాటి శ్రీను వాటిని సద్వినియోగం చేసుకోలేదు. రకరకాల కారణాలతో లేటైంది. దాంతో ఆయన తను ఇచ్చిన డేట్స్ పూర్తి అయ్యాయని వేరే వారిని చూసుకోమని వేరే ప్రాజెక్టుకు షిప్ట్ అయ్యిపోయారు.

దాంతో మళ్లీ కెమెరామెన్ వేట మొదలెట్టి ఆర్దర్ విల్సన్ ని సీన్ లోకి తెచ్చారు. దాంతో మరో 30 రోజులు పైగా షూటింగ్ పెండింగ్ ఉందని, అందుకే ఆ హడావిడిలో పబ్లిసిటీ మీద కాన్సర్టేట్ చేయలేం అని టీజర్, ట్రైలర్ వంటివేమీ రిలీజ్ చేయలేదని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినా ఒత్తిడి పెరిగిపోతుందని భావించే బోయపాటి సైలెంట్ అయ్యినట్లు ఇన్ సైడ్ వార్.